Trump-Mojtaba: అమెరికాతో చర్చలపై మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం.. నిజమేనా?
- అమెరికాతో చర్చలపై మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- అధికారికంగా ధృవీకరించని ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ ఐదు రోజుల బ్రేక్ ఇచ్చారు. ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని తోసిపుచ్చింది.
అయితే తాజాగా అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
రెండు దేశాల మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ నుంచి ఈ రకమైన వార్త రావడం ఒక విధంగా సానుకూల సంకేతంగా చెప్పుకోవచ్చు. అమెరికాతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఇరాన్ షరతులకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందానికి రావడానికి సిద్ధంగా ఉన్నానని మోజ్తాబా ఖమేనీ సూచించినట్లు మంగళవారం కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి.
ఇది కూడా చదవండి: 10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆదివారం చర్చలు జరిగినట్లుగా సమాచారం. 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్ల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరపున మహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారని ‘ది జెరూసలేం పోస్ట్’ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తన నివేదికలో పేర్కొంది. అయితే ఘాలిబాఫ్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ‘‘అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు. ఆర్థిక, చమురు మార్కెట్లను తారుమారు చేయడానికి, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ చిక్కుకున్న చిక్కుముడి నుంచి బయటపడటానికి తప్పుడు వార్తలను ఉపయోగిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Adhurs 2: వినాయక్ సంచలన వ్యాఖ్యలు .. చారిని మళ్ళీ చూడనట్టే?
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!