UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- యూపీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం..
- 50 స్థానాల్లో పోటీ చేస్తామని కర్ణిసేన ప్రకటన..
- అగ్రవర్ణ ఓటర్లనే టార్గెట్ చేసిన కర్ణిసేన..
- బీజేపీపై ప్రభావం, ఎస్పీకి ప్లస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మొదట్లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలు ప్రభావితం చేసేలా ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా యూపీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, యూపీలో మాత్రం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన, రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సూరజ్పాల్ సింగ్ అమ్మూ ప్రకటించారు.
క్షత్రియ ఓట్లపై కర్ణిసేన గురి..
రాజ్పుత్ లేదా ఠాకూర్లు యూపీ ఎన్నికల్లో కీలక వర్గంగా ఉంది. 50 నుంచి 70 స్థానాలు వీరు ప్రభావితం చేస్తారు. గతంలో యూపీకి ఐదుగురు సీఎంలు ఠాకూర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. 15-25 శాతం వరకు రాజ్పుత్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అమ్మూ చెప్పారు. అగ్రవర్ణాల సమస్యలు, రిజర్వేషన్లు, ఓబీసీ అంశాలపై మాట్లాడుతామని చెప్పారు. ఇప్పటికే ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్తో అమ్మూ భేటీ అయ్యారు.
Also Read
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
అసలు సవాల్ బీజేపీకే.. ఎస్పీకి లాభమా?
ఉత్తర్ ప్రదేశ్లో కర్ణిసేన పోటీ బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అగ్రవర్ణాలు బీజేపీకి ఓటు బ్యాంక్గా ఉన్నారు. ఇప్పుడు కర్ణిసేన పోటీ చేస్తే ఈ ఓట్ బ్యాంక్పై ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో అగ్రవర్ణ ఓట్లలో చీలిక ఏర్పడితే ఇది ఎస్పీ-కాంగ్రెస్కు లాభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పీడీఏ(వెనకబడిన, దళిత, ఆదివాసీ) నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ ఫార్ములాతోనే ఎస్పీ 37 లోక్సభ సీట్లను గెలుచుకుంటే, బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు అగ్రవర్ణ ఓటర్లలో ఒక వేళ చీలిక ఏర్పడితే ఇది అంతిమంగా బీజేపీకి నష్టం చేకూర్చి, ఎస్పీకి లాభమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!