Iran War: ఇరాన్ నుంచి క్రూడాయిల్తో భారత్కు వస్తున్న నౌక, చైనాకు మళ్లించబడింది. అమెరికా ఆంక్షలకు గురైన ఈ ట్యాంకర్ భారత్ వస్తున్న సమయంలోనే తన మార్గాన్ని మార్చుకుంది. ఈ షిప్ భారత్కు వచ్చి ఉంటే 2019 తర్వాత, ఇరాన్ నుంచి చమురు కొనడం ఇదే తొలిసారి అయ్యేది. 2025లో అమెరికా ఆంక్షలకు గురైన అఫ్రామాక్స్ ట్యాంకర్ 'పింగ్ షున్', ఈ వారం ప్రారంభంలో సూచించిన గుజరాత్లోని వడినార్కు బదులుగా,
Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.
LPG: ఇరాన్ యుద్ధం భారత్ ఇంధన సంక్షోభాన్ని పెంచింది. ముఖ్యంగా ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, భారత్ లాంటి మిత్ర దేశాలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. Read Also: Tollywood : నాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరో ఇదిలా…
Iran vs Israel War: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు నెల రోజులు పూర్తయింది. సరిగ్గా ఈ ఏడాదిలోని ఫిబ్రవరి 28న ఘర్షణ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని సైనిక స్థావరాలు, నగరాలపై ఆకస్మిక వైమానిక దాడులు చేయడం ద్వారా ఈ సంఘర్షణకు బీజం పడింది. ఈ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అధికారులు మరణించారు. ఖమేనీ మరణంతో ఇరాన్ కుప్పకూలుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా ఆ దేశ…
India-Russia: ఇరాన్ యుద్ధం రష్యా పంట పండిస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యన్ క్రూడ్ ఆయిల్కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని పెంచాలని చూస్తోంది.
LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, చమురు-గ్యాస్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జలమార్గం ద్వారా 20 శాతం ఇంధన రవాణా జరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. భారత్లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా వంట గ్యాస్పై ప్రజలు భయాందోళనలో ఉన్నాయి. మనం దిగుమతి చేసుకునే LPGలో 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుండటంతో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రదేశం…
PM Modi: మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాజ్యసభలో అన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చల మార్గాన్ని అనుసరించాలని భారత్ సూచించింది. ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ప్రధాని హెచ్చరించారు. ముఖ్యంగా ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరుక్కుపోయిన నౌకలు, అందులోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. Read Also: OnePlus Nord 6: వన్ ప్లస్ నార్డ్ 6.. 9000mAh బ్యాటరీ,…
Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ అమెరికా దాడుల కారణంగా ఇరాన్ ఇంధన రవాణాకు చాలా కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్కు 5 డాలర్లు దాటాయి. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇదే కాకుండా, ఇంధన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రమాణ ఖర్చులు మరింత…
ఇరాన్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సముద్ర మార్గాలను కాపాడేందుకు సైనిక సాయం అందించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాకు మిత్రులుగా ఉన్న దేశాలను ఆయన ‘పిరికివారు’ అని సంబోధించారు. ‘మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ట్రంప్ వాదన ఏమిటి..? చమురు (ఆయిల్) ధరలు పెరిగిపోతున్నాయని అందరూ ఫిర్యాదు చేస్తున్నారని.. కానీ హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ట్రంప్ విమర్శించారు.…
మధ్యప్రాచ్యంలో యుద్ధం నిన్నటిదాకా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మరో ఎత్తుగా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమాయ్యాక ఇరాన్ ప్రతీకార దాడులు స్వల్ప రేంజ్లోనే జరిగాయి.