Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finance Ministry: అక్టోబర్ 15 నుంచి యూపీఐ (UPI) ద్వారా వ్యాపారులకు (Merchants) రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 0.4% మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 75,000 దాటిన లావాదేవీలకు ఈ రుసుము గరిష్టంగా రూ. 300 వరకు పరిమితమవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక విదేశీ ఒత్తిళ్లు లేదా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునే వ్యూహం ఉందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. విదేశీ ప్రభావం ఉందనేది పూర్తిగా అసత్యమని ఖండించింది. స్వయంసమృద్ధి, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేయడానికే భారత్ స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
కంగారు వద్దు..
Also Read
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ముఖ్యంగా వినియోగదారులు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ MDR భారం కస్టమర్లపై పడదు. ఈ రుసుమును కేవలం వ్యాపారుల వద్ద నుంచే వసూలు చేస్తారు. నెలకి రూ. 1 లక్ష కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు పొందే వ్యాపారులను ‘మర్చంట్స్’గా పరిగణించి వారి నుంచి మాత్రమే దీనిని వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ. 10,000 వ్యాపారికి వస్తే, వారు రూ. 40 MDR చెల్లిస్తారు. వినియోగదారుల నుంచి ఈ రుసుమును వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. పైగా, యూజర్లపై ఎలాంటి ప్లాట్ఫారమ్ లేదా హిడెన్ ఛార్జీలు విధించకూడదని యూపీఐ యాప్ సంస్థలకు చెప్పడం జరిగింది. సాధారణంగా చేసే P2P (స్నేహితులకు, ఇతరులకు పంపే) బదిలీలు, చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం. ఈ నిర్ణయంతో దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. రైల్వేలు, టెలికామ్, ఇన్సూరెన్స్ వంటి కొన్ని రంగాలకు ఫ్లాట్ రూ. 5 ఛార్జీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02% ఛార్జీ మాత్రమే వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!