AI: మీడియాకు ఎసరు పెడుతున్న AI.. 200 మందిని తొలగించిన దిగ్గజ వార్తా సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు టెక్ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతోంది. రానున్న కాలంలో మానవుడి మనుగడ మరింత స్మార్ట్ కావడానికి ఏఐ కీలకంగా మారుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ మీద దృష్టి పెట్టి కొట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే నాణేనికి మరో వైపు మాత్రం ఏఐ వల్ల చాలా మంది కొలువులు పోతున్నాయి. రానున్న కాలంలో పలు రంగాల్లో ఉద్యోగులను తొలగించి వారి స్థానాలను ఏఐతో రిప్లేస్ చేయబోతున్నారు.
తాజాగా ఏఐ దెబ్బ మీడియాకు కూడా తాకింది. జర్మనీకి చెందిన ప్రముఖ వార్తా సంస్థ తన సిబ్బందిలో 20 శాతాన్ని తొలగించింది. వీరందరి బాధ్యతలను ఏఐకి అప్పగించనుంది. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ అయిన ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి, కొంతమంది ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో భర్తీ చేయాలనే నిర్ణయించింది. ముఖ్యంగా ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేయనుంది.
Also Read
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లు, ప్రూఫ్రీడర్లు, ప్రింటిగ్ సెక్షన్ లో పనిచేస్తున్న పలువురు స్థానాలను ఏఐ రీప్లేస్ చేయబోతోంది. ఈ నిర్ణయంతో యూరప్ వ్యాప్తంగా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికల్లో ఒకటైన బిల్డ్ పై ప్రభావం పడనుంది. ఆక్సెల్ స్ప్రింగర్ అనేది జర్మన్ పబ్లికేషన్స్ ఇది యూరప్ లో ప్రముఖ పత్రికలైన బిల్డ్, వెల్ట్, పొలిటికో, ఇన్ సైడర్ వంటి మల్టీ మీడియా న్యూస్ బ్రాండ్లకు మాతృ సంస్థ.
బిల్డ్ లో ప్రస్తుతం 1000 మంది ఉద్యోగుల్లో 200 మంది ప్రభావితం అవుతున్నారు. వీరి తొలగింపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉన్నాయి. అయితే AI ఎడిటర్లు, రిపోర్టర్లకు సమయాన్ని ఆదా చేసే విలువైన సాధనంగా మారుతుందని బిల్డ్ ప్రతినిధి అన్నారు. ఇప్పటి వరకు టెక్ సంస్థల్లో మాత్రమే ఆటోమెషన్ పదాన్ని విన్నాం, ఇప్పుడు ఇది మీడియా సంస్థలకు కూడా పాకింది.
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!