Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Italian Town Could Fine Tourists $300 For Taking Selfies: ఏదైనా ఒక అందమైన ప్రాంతం కనిపిస్తే చాలు.. ఫోటో ప్రియులు వెంటనే అక్కడ ఫోటోలు క్లిక్మనిపిస్తారు. తమకున్న ఫోటోగ్రఫీ స్కిల్స్ మొత్తం వాడేసి, రకరకాలుగా ఆ ప్రాంతంలో ఫోటోలు దిగి.. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక టూరిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఫోటోలు దిగడం కోసమే ఆయా అందమైన ప్రదేశాలను సెలెక్ట్ చేసుకొని మరీ వెళ్తుంటారు. కానీ.. ఇటలీలోని పోర్టోఫినో పట్టణానికి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకటే.. అక్కడి సుందరమైన దృశ్యాల వద్ద సెల్ఫీలు గానీ, ఫొటోలు గానీ దిగడం కుదరదు. ఈమేరకు అక్కడ ఫోటోలు దిగడాన్ని నిషేధం విధిస్తూ.. పట్టణం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Vinay Bhaskar: అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ఇటలీలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో పోర్టోఫినో ప్రాంతం ఒకటి. అక్కడి జనాభా కేవలం 500 మంది మాత్రమే. సెలవుల్లో మరీ ముఖ్యంగా.. వేసవి కాలంలో వేలాదిమంది పర్యాటకులు ఆ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. కనులవిందుగా ఉండే అందమైన ప్రదేశం కావడంతో.. అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగే నెపంతో ఒకే చోట ఎక్కువ మంది జనం గుమిగూడుతున్నారు. దీంతో.. ఈ ప్రాంతమంతా రద్దీగా తయారవుతుంది. దీంతో.. స్థానిక కార్యకలాపాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారింది. ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోతుండటంతో.. గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే.. ఫోర్టోఫినోలో రద్దీని తగ్గించడం కోసం, అక్కడి అధికారులు కొన్ని నిబంధనలు విధించారు. వాటిల్లో.. ఫోటోలు దిగడాన్ని బ్యాన్ చేసింది. పర్యాటకులు ఎవరూ సెల్ఫీలు దిగకుండా.. నో-వెయిటింగ్ జోన్ను ప్రవేశపెట్టింది.
Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
ఒకవేళ ఎవరైనా నిబంధనల్ని అతక్రమించి సెల్పీలు గానీ, ఫోటోలు గానీ తీస్తే.. 275 యూరోల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.25 వేలు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈస్టర్ వారాంతం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 వరకు వర్తిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ నియమాలు అమల్లో ఉండనున్నాయి. ఈ వ్యవహారంపై ఫోర్టోఫినో మేయర్ మాటియో వయాకావా మాట్లాడుతూ.. ఫోటోలు దిగేందుకు జనాలు ఒకేచోట గుమిగూడడం వల్ల వీధుల్లో గంటల తరబడి ట్రాపిక్ స్తంభించిపోతోంది. దీంతో గందరగోళం నెలకొంటోంది. దానికి పర్యాటకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆయన.. భద్రతా చర్యల దృష్ట్యా సెల్ఫీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?