Vinay Bhaskar: అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో బీఆరెస్ ప్రతినిధుల సభలు నిర్వహిస్తామని వెల్లడించారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఇవాళ ఆయన హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు 3500 మంది ప్రతినిధులతో మడికొండ సత్యసాయి కన్వెన్షన్ సెంటర్ లో సభ ఉంటుందని తెలిపారు. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చ, వివిధ తీర్మానాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ పై తీర్మానాలు చేస్తామని, దొంగే దొంగ దొంగ అన్నట్టు.. బీజేపీ నాయకులు, అమిత్ షా అనేక అబద్ధాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : JC Diwakar Reddy: జేసీ సంచలనం.. సీమను తెలంగాణలో కలపాల్సిందే..!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అమిత్ షా.. ఒక అబద్ధాల షా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ ఉనికిని చాటుకోవడానికే ఇక్కడికి వస్తున్నారని, దేశంలో కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్ర నేతల కుర్చీలు కదులుతున్నాయనే ఉద్దేశ్యంతో కేసీఆర్పై అనేక ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కృషి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని, అమిత్ షా, మోడీ పతనం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కేసీఆర్ నేతృత్వంలో పార్టీ కీలకంగా వ్యవహరిస్తుందని, విభజన హామీల్లో భాగంగా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ అడిగామన్నారు. రైల్వే వాళ్ళు అడిగినంత స్థలం ఇచ్చామని, 10 ఎకరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారన్నారు. రైతులకు పరిహారం ఇచ్చి రైల్వే కు స్థలం అప్పగించామన్నారు. బీజేపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
Also Read : Harish Rao: ఓటమి తప్పదు.. అందుకే అమిత్ షా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!