China: వీగర్ ముస్లింలను రంజాన్ ప్రార్థనలకు కూడా అనుమతించని చైనా ప్రభుత్వం..
China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది. ఏప్రిల్ 20-21 తేదీల్లో రంజాన్ సందర్భంగా స్థానిక మసీదుల్లో 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతించింది. ఇలా అనుమతి పొందిన వారిపై కూడా అధికారులు నిఘా పెట్టారు. జిన్జియాంగ్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లో భారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేశారు. చివరకు ఇళ్లలో ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారా..? అని నిఘా పెట్టారు.
Read Also: Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
అయితే చైనా ప్రభుత్వం మాత్రం మతపరమైన తీవ్రవాదాన్ని అణిచివేసేందుకే ఇలా చేస్తున్నాం అంటూ తన చర్యలను సమర్థించుకుంది. యార్క్ వ్రుక్ పట్టణంలో ఈద్ ప్రార్థనలకు కేవలం ఒకే మసీదును తెరిచారు. బులుంగ్ పట్టణంలోని బేకౌంటీ ప్రాంతం 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే మసీదుల్లోకి అనుమతించారు. వీరిని గమనించడానికి పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. చైనా ప్రభుత్వం 2017 నుంచి జాతి, మతపరమైన ఆచారాలను పాటించడంపై నిషేధం విధించింది. ఇదిలా ఉంటే గతేడాది ఇస్లాంలో మార్పులు చేయడానికి చైనా ప్రయత్నం చేసింది. ‘‘దేశభక్తి చాటుకోండి.. చైనా నియమాలకు అనుగుణంగా ఇస్లాంను మార్చుకోండి’’ అంటూ పిలుపునిచ్చింది.
చైనాలో 2.5 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో ముస్లింల సంఖ్య అధికం. ఇక్కడ వీగర్ ముస్లింల ప్రతీ కదలికను చైనా నిశితంగా గమనిస్తుంటుంది. ఈ ప్రాంతంలో 1.2 కోట్ల మంది వీగర్లు నివసిస్తున్నారు. వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చైనా ఆరోపిస్తూ, వీరిని నిర్భంధానికి గురి చేస్తోంది. వీగర్ ముస్లింలపై చైనా అణిచివేత, మానవహక్కుల ఉల్లంఘనపై పాశ్చాత్య దేశాలు స్పందిస్తున్నా.. చైనా వాటిని ఏమాత్రం లెక్కచేయడం లేదు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?