China: వీగర్ ముస్లింలను రంజాన్ ప్రార్థనలకు కూడా అనుమతించని చైనా ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది. ఏప్రిల్ 20-21 తేదీల్లో రంజాన్ సందర్భంగా స్థానిక మసీదుల్లో 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతించింది. ఇలా అనుమతి పొందిన వారిపై కూడా అధికారులు నిఘా పెట్టారు. జిన్జియాంగ్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లో భారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేశారు. చివరకు ఇళ్లలో ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారా..? అని నిఘా పెట్టారు.
Read Also: Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
అయితే చైనా ప్రభుత్వం మాత్రం మతపరమైన తీవ్రవాదాన్ని అణిచివేసేందుకే ఇలా చేస్తున్నాం అంటూ తన చర్యలను సమర్థించుకుంది. యార్క్ వ్రుక్ పట్టణంలో ఈద్ ప్రార్థనలకు కేవలం ఒకే మసీదును తెరిచారు. బులుంగ్ పట్టణంలోని బేకౌంటీ ప్రాంతం 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే మసీదుల్లోకి అనుమతించారు. వీరిని గమనించడానికి పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. చైనా ప్రభుత్వం 2017 నుంచి జాతి, మతపరమైన ఆచారాలను పాటించడంపై నిషేధం విధించింది. ఇదిలా ఉంటే గతేడాది ఇస్లాంలో మార్పులు చేయడానికి చైనా ప్రయత్నం చేసింది. ‘‘దేశభక్తి చాటుకోండి.. చైనా నియమాలకు అనుగుణంగా ఇస్లాంను మార్చుకోండి’’ అంటూ పిలుపునిచ్చింది.
చైనాలో 2.5 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో ముస్లింల సంఖ్య అధికం. ఇక్కడ వీగర్ ముస్లింల ప్రతీ కదలికను చైనా నిశితంగా గమనిస్తుంటుంది. ఈ ప్రాంతంలో 1.2 కోట్ల మంది వీగర్లు నివసిస్తున్నారు. వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చైనా ఆరోపిస్తూ, వీరిని నిర్భంధానికి గురి చేస్తోంది. వీగర్ ముస్లింలపై చైనా అణిచివేత, మానవహక్కుల ఉల్లంఘనపై పాశ్చాత్య దేశాలు స్పందిస్తున్నా.. చైనా వాటిని ఏమాత్రం లెక్కచేయడం లేదు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!