Pakistan: భారత్తో ఉద్రిక్తత.. రక్షణ బడ్జెట్ని 18% పెంచిన పాకిస్తాన్..
- భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత..
- బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచిన పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యవాసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి, సైన్యాన్ని బలోపేతం చేస్తోంది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచుతోంది. జూలై 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ఆవిష్కరించనుంది.
Read Also: MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతోంది. సోమవారం బడ్జెట్పై చర్చించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, అతడి ఆర్థిక బృందంతో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సమావేశమయ్యారు. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలకంగా ఉంది. సుమారుగా రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్ ని పాక్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంట్లో 18 శాతం రక్షణ వ్యయాన్ని పెంచేందుకు అనుమతించింది.
ప్రస్తుత భద్రతా ముప్పుల దృష్ట్యా, రక్షణ బడ్జెట్ను 18 శాతం పెంచి రూ.2.5 ట్రిలియన్లకు పెంచాలనే ప్రతిపాదనకు పిపిపి మద్దతు ఇచ్చిందని పాక్ ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో, ప్రభుత్వం రక్షణ వ్యయం కోసం రూ.2,122 బిలియన్లను కేటాయించింది, ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఉంచిన రూ.1,804 బిలియన్ల కంటే 14.98 శాతం ఎక్కువ. రుణ చెల్లింపుల తర్వాత వార్షిక వ్యయంలో రక్షణ రంగానికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం, రుణాల చెల్లింపుకు రూ. 9700 బిలియన్లు కేటాయించారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!