Pakistan: భారత్తో ఉద్రిక్తత.. రక్షణ బడ్జెట్ని 18% పెంచిన పాకిస్తాన్..
- భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత..
- బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచిన పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యవాసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి, సైన్యాన్ని బలోపేతం చేస్తోంది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచుతోంది. జూలై 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ఆవిష్కరించనుంది.
Read Also: MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
Also Read
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతోంది. సోమవారం బడ్జెట్పై చర్చించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, అతడి ఆర్థిక బృందంతో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సమావేశమయ్యారు. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలకంగా ఉంది. సుమారుగా రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్ ని పాక్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంట్లో 18 శాతం రక్షణ వ్యయాన్ని పెంచేందుకు అనుమతించింది.
ప్రస్తుత భద్రతా ముప్పుల దృష్ట్యా, రక్షణ బడ్జెట్ను 18 శాతం పెంచి రూ.2.5 ట్రిలియన్లకు పెంచాలనే ప్రతిపాదనకు పిపిపి మద్దతు ఇచ్చిందని పాక్ ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో, ప్రభుత్వం రక్షణ వ్యయం కోసం రూ.2,122 బిలియన్లను కేటాయించింది, ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఉంచిన రూ.1,804 బిలియన్ల కంటే 14.98 శాతం ఎక్కువ. రుణ చెల్లింపుల తర్వాత వార్షిక వ్యయంలో రక్షణ రంగానికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం, రుణాల చెల్లింపుకు రూ. 9700 బిలియన్లు కేటాయించారు.
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..