Pakistan: భారత్తో ఉద్రిక్తత.. రక్షణ బడ్జెట్ని 18% పెంచిన పాకిస్తాన్..
- భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత..
- బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచిన పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యవాసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి, సైన్యాన్ని బలోపేతం చేస్తోంది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచుతోంది. జూలై 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ఆవిష్కరించనుంది.
Read Also: MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతోంది. సోమవారం బడ్జెట్పై చర్చించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, అతడి ఆర్థిక బృందంతో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సమావేశమయ్యారు. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలకంగా ఉంది. సుమారుగా రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్ ని పాక్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంట్లో 18 శాతం రక్షణ వ్యయాన్ని పెంచేందుకు అనుమతించింది.
ప్రస్తుత భద్రతా ముప్పుల దృష్ట్యా, రక్షణ బడ్జెట్ను 18 శాతం పెంచి రూ.2.5 ట్రిలియన్లకు పెంచాలనే ప్రతిపాదనకు పిపిపి మద్దతు ఇచ్చిందని పాక్ ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో, ప్రభుత్వం రక్షణ వ్యయం కోసం రూ.2,122 బిలియన్లను కేటాయించింది, ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఉంచిన రూ.1,804 బిలియన్ల కంటే 14.98 శాతం ఎక్కువ. రుణ చెల్లింపుల తర్వాత వార్షిక వ్యయంలో రక్షణ రంగానికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం, రుణాల చెల్లింపుకు రూ. 9700 బిలియన్లు కేటాయించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..