UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
- ఉత్తరప్రదేశ్లో బయటపడ్డ కొత్త తరహా దోపిడీ వ్యవహారం
- తప్పిపోయిన కొడుకునంటూ ఇంట్లో చేరి చోరీలు
- చాకచక్యంగా పట్టుకున్న యూపీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో కొత్త తరహా దోపిడీ వ్యవహారం బయటపడింది. నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన ఘజియాబాద్లో చోటుచేసుకుంది.
ఇటీవల రాజు అనే యువకుడు ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. 30 ఏళ్ల క్రితం తాను కిడ్నాప్కు గురైనట్లు.. సోదరితో స్కూల్కి వెళ్తుండగా అగంతకులు ఎత్తుకెళ్లిపోయారని స్టోరీ చెప్పాడు. నిజమే అనుకుని పోలీసులు ఆశ్రయించి.. ప్రకటనలు ఇచ్చారు. ఓ వ్యక్తి.. తప్పిపోయిన మేనల్లుడే అనుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు కూడా ముచ్చటపడ్డారు. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో పరిస్థితులు అన్ని కుదిటపడ్డాక.. అతగాడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరా తీయడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. డీఎన్ఏ టెస్ట్లో కుటుంబ సభ్యులతో సరిపోలేదు. దీంతో తమదైన శైలిలో విచారిస్తే.. రాజు నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడెక్కడా పిల్లలు తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో.. ఎంక్వైరీ చేసి వారి ఇంట్లోకి ప్రవేశించి ఆస్తులు వివరాలు తెలుసుకుని దోపిడీ చేస్తున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు.
Also Read
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ఇది కూడా చదవండి: Pushpa 2: రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రాజస్థాన్కు చెందిన రాజుగా గుర్తించారు. అతడు దొంగతనాలకు అలవాటుపడటంతో విసుగు చెందిన కుటుంబసభ్యులు 2005లో బయటకు గెంటేశారని తెలిపారు. అప్పటినుంచి పిల్లలు తప్పిపోయిన కుటుంబాల వివరాలు సేకరిస్తూ.. పేరు మార్చుకొని తానే వారి కుమారుడినని నమ్మించి.. వారి ఇంట్లో తిష్ఠ వేసే వాడనని చెప్పారు. కొన్ని రోజుల అనంతరం ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దోచుకొని ఎవరికీ చెప్పకుండా ఉడాయించేవాడని తెలిపారు. అలా ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని హిసార్, సిర్సాలోని తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: INDIA Alliance: ఇక ఇండియా కూటమి సంగతి అంతేనా.. కాంగ్రెస్కి ‘హ్యాండ్’ ఇస్తున్న మిత్రులు..
తాజావార్తలు
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!