Turkey: “వెంటనే ఆ పిచ్చిని ఆపేయండి”.. ఇజ్రాయిల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని ఎర్డోగాన్ ఎక్స్(ట్విట్టర్)లో వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ వెంటనే ఈ ‘మ్యాడ్ నెస్’ని ఆపేయాలని, దాడులను ముగించాలని కోరారు. ఎర్డోగాన్ శనివారం ఇస్తాంబుల్ లో పాలస్తీనాకు మద్దతుగా తన పార్టీ ఇస్లామో-కన్సర్వేటివ్ ఏకేపీ పార్టీ నిర్వహించనున్న ర్యాలీని ప్రోత్సహించాడు. ఈ ర్యాలీకి దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటాని ఎర్డోగాన్ ప్రకటించారు.
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
Read Also: Yogesh Kadyan: పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గన్ను పట్టుకున్నాడు .. 19 ఏళ్లకే రెడ్ కార్నర్ నోటీసులు
రెండున్నర దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న ఎర్డోగాన్ పలుమార్లు పాలస్తీనాకు మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో మొదటిసారిగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో మరోసారి పాలస్తీనా స్టాండ్ తీసుకున్నారు. హమాస్ నాయకులు ఉగ్రవాదులు కాదని, తమ భూమి కోసం పోరాడుతున్న విముక్తి పోరాట యోధులుగా అభివర్ణించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించగా.. 229 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు బంధించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 7000కు పైగా ప్రజలు మరణించారు. ఇందులో 3000 మంది పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!