Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Starvation Deaths Will Be Inevitable With Indias Water Bomb Pakistani Senator Is Concerned

Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..

Published Date :May 23, 2025 , 8:06 pm
By Venu Goapl Reddy
  • ‘‘భారత్ నీటి బాంబుతో పాక్‌లో ఆకలి చావులు’’..
  • సింధూ నది జలాల నిలుపుదలపై పాక్ సెనెటర్..
Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాశవికంగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఈ చర్యల తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్, పీఓకేలోని భూభాగాల్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌ని భయపెడుతున్న అంశం సింధు జల ఒప్పందం నిలిపివేత.

Read Also: IndiGo Incident: పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు గాలిలో కలిసేవే.. నిమిషంలో 2.5 కి.మీ కిందకు పడిపోయిన విమానం..

Also Read

  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
  • UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
  • Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!

తాజాగా, పాకిస్తాన్ సెనెటర్ సయ్యద్ అలీ జాఫర్ తన ఆందోళన వ్యక్తపరిచారు. భారతదేశం వేసిన ‘‘నీటి బాంబు’’ని నిర్వీర్యపరచాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని కోరారు. ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన జాఫర్ మాట్లాడుతూ.. సింధూ జలాలు నిలిపేయడం వల్ల పది మందిలో ఒకరు ప్రభావితమవుతారని హెచ్చరించారు. ‘‘మనం ఇప్పుడు ఈ నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోతే, మనం ఆకలితో చనిపోవచ్చు. కారణం సింధు నదీ పరీవాహక ప్రాంతం మన జీవనాడి. మన నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తాయి. ప్రతి పది మందిలో తొమ్మిది మంది అంతర్జాతీయ సరిహద్దు పరీవాహక ప్రాంతాల ఆధారంగా తమ జీవితాలను గడుపుతున్నారు’’ అని జాఫర్ అన్నారు. పాకిస్తాన్ పంటల్లో 90 శాతం ఈ నీటిపై ఆధారపడి ఉంటాయని, మన విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ సింధూ జలాలపై నిర్మించబడ్డాయని, అందుకు ఇది పాకిస్తాన్‌పై నీటి బాంబు లాంటిదని చెప్పారు.

సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్‌కు మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ల నుండి నీటిని నియంత్రించడానికి అనుమతించింది, అదే సమయంలో తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్‌లకు భారతదేశానికి హక్కులు కల్పించింది. ఈ జలాలు పాకిస్తాన్ నీటిపారుదల, తాగునీటి అవసరాలకు చాలా ముఖ్యమైనవి, ఇవి పాక్‌లో 80% నీటిని అందిస్తాయి. అయితే, పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసింది. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని ఇటీవల ప్రధాని మోడీ ఈ ఒప్పందం గురించి పాకిస్తాన్‌కి స్పష్టంగా చెప్పారు.

🚨 PAKISTANI SENATOR : India walo Pani de do 😭😂 pic.twitter.com/kLBdhp6aEj

— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Pakistan
  • Indus Water Treaty
  • Pahalgam terror attack
  • Pakistan
  • Pakistan Senator Syed Ali Zafar

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions