Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..
- ‘‘భారత్ నీటి బాంబుతో పాక్లో ఆకలి చావులు’’..
- సింధూ నది జలాల నిలుపుదలపై పాక్ సెనెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాశవికంగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఈ చర్యల తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్, పీఓకేలోని భూభాగాల్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ని భయపెడుతున్న అంశం సింధు జల ఒప్పందం నిలిపివేత.
Also Read
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
తాజాగా, పాకిస్తాన్ సెనెటర్ సయ్యద్ అలీ జాఫర్ తన ఆందోళన వ్యక్తపరిచారు. భారతదేశం వేసిన ‘‘నీటి బాంబు’’ని నిర్వీర్యపరచాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని కోరారు. ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన జాఫర్ మాట్లాడుతూ.. సింధూ జలాలు నిలిపేయడం వల్ల పది మందిలో ఒకరు ప్రభావితమవుతారని హెచ్చరించారు. ‘‘మనం ఇప్పుడు ఈ నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోతే, మనం ఆకలితో చనిపోవచ్చు. కారణం సింధు నదీ పరీవాహక ప్రాంతం మన జీవనాడి. మన నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తాయి. ప్రతి పది మందిలో తొమ్మిది మంది అంతర్జాతీయ సరిహద్దు పరీవాహక ప్రాంతాల ఆధారంగా తమ జీవితాలను గడుపుతున్నారు’’ అని జాఫర్ అన్నారు. పాకిస్తాన్ పంటల్లో 90 శాతం ఈ నీటిపై ఆధారపడి ఉంటాయని, మన విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ సింధూ జలాలపై నిర్మించబడ్డాయని, అందుకు ఇది పాకిస్తాన్పై నీటి బాంబు లాంటిదని చెప్పారు.
సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్కు మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ల నుండి నీటిని నియంత్రించడానికి అనుమతించింది, అదే సమయంలో తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్లకు భారతదేశానికి హక్కులు కల్పించింది. ఈ జలాలు పాకిస్తాన్ నీటిపారుదల, తాగునీటి అవసరాలకు చాలా ముఖ్యమైనవి, ఇవి పాక్లో 80% నీటిని అందిస్తాయి. అయితే, పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసింది. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని ఇటీవల ప్రధాని మోడీ ఈ ఒప్పందం గురించి పాకిస్తాన్కి స్పష్టంగా చెప్పారు.
🚨 PAKISTANI SENATOR : India walo Pani de do 😭😂 pic.twitter.com/kLBdhp6aEj
— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025
తాజావార్తలు
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!