IndiGo Incident: పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు గాలిలో కలిసేవే.. నిమిషంలో 2.5 కి.మీ కిందకు పడిపోయిన విమానం..
- పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు పోయేవి..
- పైలట్ల నైపుణ్యంతో బయటపడిన ఇండిగో విమానం..
- నిమిషానికి ఏకంగా 8500 అడుగులు పడిపోయిన ఫ్లైట్..
- చివరకు శ్రీనగర్లో ల్యాండ్ కావడంతో ఉపిరిపీల్చుకున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Incident: బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విపరీతమైన వడగళ్ల వాన, దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న విమానం అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు పైలట్లు విజయవంతంగా విమానాన్ని శ్రీనగర్లో ల్యాండ్ చేయడంతో అందులోని 220 మంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన వాతావరణం నుంచి బయటపడటానికి ఇండిగో పైలట్లు లాహోర్ ఏటీసీని సంప్రదించినప్పటికీ, పాకిస్తాన్ తమ ఎయిర్స్పేస్ ఉపయోగించుకోవడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ తీరు వల్ల 220 మంది ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది.
Read Also: Covid-19: తొమ్మిది నెలల శిశుకుకు కోవిడ్-19 పాజిటివ్..
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
డీజీసీఏ ప్రాథమిక అంచనా ప్రకారం, విమానం తన యాంగిల్ ఆఫ్ అటాక్(AOA) లోపంతో ఉండగా, విమానంలోని నియంత్రణ వ్యవస్థలు వైఫల్యానికి గురవుతూ వచ్చాయి. ఈ గందరగోళం మధ్య ఆటోపైలెట్ కూడా పడిపోయింది. దీంతో, సిబ్బంది పూర్తిగా మాన్యువల్ కంట్రోల్లోనే విమానాన్ని నియంత్రించాల్సి వచ్చింది. ఒక దశలో నిమిషానికి 8,500 అడుగుల వేగంతో వేగంగా దిగింది, ఇది సాధారణంగా నిమిషానికి 1,500-3,000 అడుగుల వేగం కంటే చాలా ఎక్కువగా ఉంది.. ఆ సమయంలో విమానం తన గరిష్ట వేగం, మాక్ నెంబర్ని చేరుకుందనే ‘స్టాల్’ వార్నింగ్స్ వచ్చాయి. పైలట్ల మాన్యువల్ ఫ్లయింగ్ నైపుణ్యాలతో విమానాన్ని స్థిరంగా ఉంచారు.
ఇదిలా ఉంటే, విపతీరమైన వడగళ్ల వాన, టర్బులెన్స్ విమానాన్ని చుట్టుముట్టాయి. దీంతో విమానం నిమిషానికి 8500 అడుగుల వేగంతో కిందకు దిగింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం ఈ గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుంది. పాకిస్తాన్ స్వల్పకాలం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఢిల్లీకి తిరిగి వెళ్లాలని పైలట్లు అనుకున్నారు. అయితే, అప్పటికే మేఘాలు సమీపించడంతో, దట్టమైన మేఘాల గుండానే శ్రీనగర్ వైపు వెళ్లాలని సిబ్బంది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోటోలు చూపిస్తున్నాయి.
दिल्ली से श्रीनगर जा रही इंडिगो फ़्लाइट पर बिजली गिरी और वह टर्बुलेंस में फँस गई। इस दौरान प्लेन के भीतर का नज़ारा।#IndiGoFlight #IndiGo #India #TURBULENCE #PlanetFitness #FlightTurbulence #FLIGHT #lightning pic.twitter.com/nxa4YTPOMA
— SANJAY TRIPATHI (@sanjayjourno) May 22, 2025
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!