IndiGo Incident: పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు గాలిలో కలిసేవే.. నిమిషంలో 2.5 కి.మీ కిందకు పడిపోయిన విమానం..
- పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు పోయేవి..
- పైలట్ల నైపుణ్యంతో బయటపడిన ఇండిగో విమానం..
- నిమిషానికి ఏకంగా 8500 అడుగులు పడిపోయిన ఫ్లైట్..
- చివరకు శ్రీనగర్లో ల్యాండ్ కావడంతో ఉపిరిపీల్చుకున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Incident: బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విపరీతమైన వడగళ్ల వాన, దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న విమానం అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు పైలట్లు విజయవంతంగా విమానాన్ని శ్రీనగర్లో ల్యాండ్ చేయడంతో అందులోని 220 మంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన వాతావరణం నుంచి బయటపడటానికి ఇండిగో పైలట్లు లాహోర్ ఏటీసీని సంప్రదించినప్పటికీ, పాకిస్తాన్ తమ ఎయిర్స్పేస్ ఉపయోగించుకోవడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ తీరు వల్ల 220 మంది ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది.
Read Also: Covid-19: తొమ్మిది నెలల శిశుకుకు కోవిడ్-19 పాజిటివ్..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
డీజీసీఏ ప్రాథమిక అంచనా ప్రకారం, విమానం తన యాంగిల్ ఆఫ్ అటాక్(AOA) లోపంతో ఉండగా, విమానంలోని నియంత్రణ వ్యవస్థలు వైఫల్యానికి గురవుతూ వచ్చాయి. ఈ గందరగోళం మధ్య ఆటోపైలెట్ కూడా పడిపోయింది. దీంతో, సిబ్బంది పూర్తిగా మాన్యువల్ కంట్రోల్లోనే విమానాన్ని నియంత్రించాల్సి వచ్చింది. ఒక దశలో నిమిషానికి 8,500 అడుగుల వేగంతో వేగంగా దిగింది, ఇది సాధారణంగా నిమిషానికి 1,500-3,000 అడుగుల వేగం కంటే చాలా ఎక్కువగా ఉంది.. ఆ సమయంలో విమానం తన గరిష్ట వేగం, మాక్ నెంబర్ని చేరుకుందనే ‘స్టాల్’ వార్నింగ్స్ వచ్చాయి. పైలట్ల మాన్యువల్ ఫ్లయింగ్ నైపుణ్యాలతో విమానాన్ని స్థిరంగా ఉంచారు.
ఇదిలా ఉంటే, విపతీరమైన వడగళ్ల వాన, టర్బులెన్స్ విమానాన్ని చుట్టుముట్టాయి. దీంతో విమానం నిమిషానికి 8500 అడుగుల వేగంతో కిందకు దిగింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం ఈ గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుంది. పాకిస్తాన్ స్వల్పకాలం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఢిల్లీకి తిరిగి వెళ్లాలని పైలట్లు అనుకున్నారు. అయితే, అప్పటికే మేఘాలు సమీపించడంతో, దట్టమైన మేఘాల గుండానే శ్రీనగర్ వైపు వెళ్లాలని సిబ్బంది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోటోలు చూపిస్తున్నాయి.
दिल्ली से श्रीनगर जा रही इंडिगो फ़्लाइट पर बिजली गिरी और वह टर्बुलेंस में फँस गई। इस दौरान प्लेन के भीतर का नज़ारा।#IndiGoFlight #IndiGo #India #TURBULENCE #PlanetFitness #FlightTurbulence #FLIGHT #lightning pic.twitter.com/nxa4YTPOMA
— SANJAY TRIPATHI (@sanjayjourno) May 22, 2025
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!