Srilanka Economic Crisis: సంక్షోభ నివారణకు అన్ని ప్రయత్నాలు చేశా: గొటబాయ రాజపక్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు.
‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని.. రాజపక్సే లేఖలో పేర్కొన్నారు. తన కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు ఆర్థిక దుర్వినియోగం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తిందని అన్నారు. కోవిడ్ వల్ల శ్రీలంకకు విదేశీ పర్యాటకులు రాకపోవడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. సంక్షోభాన్ని నివారించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాని నా వ్యక్తిగత నమ్మకం.. ఇందులో భాగంగానే అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించా’’ అని రాజీనామా లేఖలో గొటబయ రాజపక్స పేర్కొన్నాడు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Read Also: Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుతం రణిల్ విక్రమసింఘే బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక గురించి పార్లమెంట్ చర్చించేందుకు సమావేశం అయింది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరించేందుకు మరోసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కానుంది. బుధవారం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా బలగాలు పార్లమెంట్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. అయితే రాజపక్స రాజీనామాతో శ్రీలంకలో ఆందోళనలు కొంతమేర చల్లారాయి. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు పెరగడం.. ఇంధన సంక్షోభంతో గత మార్చి నుంచి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. గొటబయ రాజపక్స రాజీనామాతో ప్రజల ఆందోళనలు సద్దుమణిగాయి.
తాజావార్తలు
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
-
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!