Srilanka Crisis: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. రోడెక్కిన లంక వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది.
ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 450 కాగా.. డిజిల్ ధర రూ. 445కు పెంచారు. దేశంలో ఇప్పటికీ కూడా పెట్రోల్, డిజిల్ ప్రజలకు లభించడం లేదు. పెట్రోల్ రాకుండానే ధరలు పెంచడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడెక్కి నిరసన తెలుపుతున్నారు లంక వాసులు.
Also Read
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ఇదిలా ఉంటే శ్రీలంకకు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఇప్పటికే ఒకసారి 40,000 మెట్రిక్ టన్నుల డిజిల్ ను ఇండియా, శ్రీలంకకు సరఫరా చేసింది. మరోసారి 40,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను శ్రీలంకకు పంపించింది. ఈ విషయాన్ని సోమవారం ఇండియా వెల్లడించింది. అప్పులు ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఇండియా పొడగించింది. సోమవారం ఇండియా పంపిన పెట్రోల్ శ్రీలంకు చేరుకున్నట్లు భారత హైకమిషనర్ ట్విట్టర్ లో వెల్లడించారు.
విదేశీ నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వడంతో పెట్రోల్ కొనుక్కునేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బులు లేవు. ఇదిలా ఉంటే పెట్రోల్ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఉత్తర మధ్య ప్రావిన్స్ లోని బంకు యజమాని ఇళ్లును తగలబెట్టారు. దీంతో ఇలా చేస్తే పెట్రోల్ రవాణాను నిలపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!