Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ వేడుకోలు..
- అంతర్జాతీయ సాయాన్ని అభ్యర్థిస్తు్న్న దాయాది దేశం..
- పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపేసిన భారత్..
- ‘‘రక్తం-నీరు కలిసి ప్రవహించలేవు’’ అనేది భారత్ వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty–IWT) నిలిపేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ‘‘రక్తం-నీరు కలిసి ప్రవహించలేవు’’ అనే వైఖరిపై భారత్ స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపేసేదాకా ఈ ఒప్పందాన్ని నిలుపు చేస్తామని భారత్ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. సింధు జలాల విషయంలో వేడుకుంటోంది.
అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్ సెమినార్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1960 నాటి ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల తమ దేశ నీటి భద్రత ప్రభావితమవుతోందని అన్నారు. ఇది పాక్ స్థిరత్వంతో ముడిపడి ఉన్న అంశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాసియాలో విస్తృత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్ 2025 ఏప్రిల్లో ఈ ఒప్పందాన్ని నిలిపేయడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని అన్నారు.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు, సహకారం అవసరమని, ఒప్పందం పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇషాక్ దార్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంతం పాకిస్థాన్లోని 25 కోట్ల మందికి పైగా ప్రజలకు జీవనాడి వంటిదని చెప్పారు. వ్యవసాయం, ఆహార భద్రత, విద్యుత్ ఉత్పత్తి, ఉపాధి, జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాలు సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయని వివరించారు.
ప్రపంచంలో వాతావరణ మార్పుల ప్రభావానికి గురవుతున్న, అత్యంత నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటని చెప్పారు. తలసరి నీటి లభ్యత తగ్గడం, వర్షపాత విధానాల్లో మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం, వరదలు, కరువులు, నీటి ప్రవాహాల్లో పెరుగుతున్న అనిశ్చితి వంటి అంశాలు పాకిస్థాన్కు సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. సింధు జలాల ఒప్పందం ద్వారా తమకు కేటాయించిన నీటిని దూరం చేసే ఏ ప్రయత్నమైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!