Srilanka Crisis: లంకలో ఉపశమన కార్యక్రమాలకు శ్రీకారం.. రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka Crisis: గొటబాయ రాజపక్స రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ యాపా అబేవర్దన ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక నిరసనకారుల ఆగ్రహావేశాలు చల్లారే దిశగా ప్రజలకు సాయం అందించడంపై రణిల్ దృష్టి సారించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంధనం, గ్యాస్, అవసరమైన ఆహార పదార్థాలను అందించడానికి అత్యవసర సహాయ కార్యక్రమాన్ని అమలు చేయాలని రణిల్ విక్రమసింఘే నిర్ణయించారు. జులై 16న మంత్రులు, పార్లమెంటు సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆగస్టులో సమర్పించే రిలీఫ్ బడ్జెట్లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు.
ఆహార భద్రత కార్యక్రమం అమలును వేగవంతం చేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సూచించారు. ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. చర్చలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. శాంతియుత నిరసనకారులు అందజేసిన ప్రణాళిక మంచి ప్రణాళికగా గుర్తింపు పొందిందని చర్చ సందర్భంగా విక్రమసింఘే అన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని తాత్కాలిక అధ్యక్షుడు తెలిపారు.అంతకుముందు, శుక్రవారం, శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
Guinea pig Record: గినియా పంది గిన్నీస్ రికార్డ్.. ఒక్క నిమిషంలో 16 విన్యాసాలు
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి చూస్తే ద్వీపదేశం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలావుండగా.. శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సలను కోర్టు అనుమతి లేకుండా జూలై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గొటబాయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్దన ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శుక్రవారం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సింగపూర్కు చేరుకున్న తర్వాత గొటబాయ రాజపక్స అధికారికంగా అధ్యక్ష పదవిని ఖాళీ చేస్తూ గురువారం తన రాజీనామా లేఖను సమర్పించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!