Sheikh Hasina: బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు..
- బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని వెంటాడుతున్న కష్టాలు..
- ఢాకాలోని షేక్ హసీనా పార్టీ ఆఫీసుపై దాడి చేసిన దుండగులు..
- అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి నిప్పు పెట్టిన అల్లరి మూకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఆఫీసును ధ్వంసం చేసి, ఆపై నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ను 15 సంవత్సరాలు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు.
Read Also: Road Accident: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు!
Also Read
- Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
కాగా, బంగ్లాదేశ్కు 1971లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ విధానం కొనసాగుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు 30 శాతం, దేశంలోని వెనుకబడిన జిల్లాల యువతకు 10 శాతం, మహిళలకు 10 శాతం, మైనార్టీలకు 5 శాతం, వికలాంగులకు ఒకశాతం రిజర్వేషన్లు అందిస్తున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2018లో బంగ్లాలోని యువత ఈ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసన ఆ తర్వాత.. బంగ్లాదేశ్ సర్కార్ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Diwali Celebrations: టపాసులు పేలుస్తూ ఆవులను పరుగెత్తించారు.. ఇదో ఆచారమట మరి!
ఇక, 2024 జూన్ 5న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ దేశంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. షేక్ హసీనా సర్కార్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయగా.. ఆ ఉత్తర్వును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు బంగ్లాదేశ్లోని యూనివర్సిటీల నుంచి మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారిపోయింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నించినప్పటికి అది ఫలించకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన భారత్ పరార్ అయింది.
తాజావార్తలు
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!