Russia: గర్ల్ఫ్రెండ్పై అత్యాచారం, కత్తితో 111 సార్లు పొడిచి చంపిన నిందితుడికి పుతిన్ క్షమాభిక్ష.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపిన వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్లాడిస్లావ్ కన్యస్ తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి, పొడిచి హత్య చేశాడు. బ్రేకప్ చెప్పిందనే కోపంతో అత్యాచారానికి పాల్పడి, మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ నేరంలో అతనికి 17 ఏళ్ల శిక్ష పడింది.
Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న ఖైదీలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతోంది. దీంట్లో భాగంగానే కాన్యుస్ని జైలు నుంచి విడుదల చేశారు. ఇటీవల సైనిక యూనిఫాంలో ఉన్న కాన్యూస్ ఫోటోను చూసిన బాధితురాలు వెరా తల్లి ఒక్సానా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది నాకు పెద్ద దెబ్బ, నా బిడ్డ ఆత్మ కూడా శాంతించదు, నా జీవితంలో ఆశను కోల్పోయానని విలపించింది. అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ముగించిందని, నాకు ఏమి చేయాలో తెలియడం లేదని ఆక్రోశం వెల్లగక్కింది. రష్యాను రక్షించడానికి అలాంటి క్రూరుడికి ఆయుధాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ప్రాంతానికి కాన్యూస్ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధృవీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా బుధవారం తెలిపారు. నవంబర్ 3న రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన క్షమాభిక్ష లేఖను ఆమె పంచుకుంది. ఏప్రిల్ 27న ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా అతనికి క్షమాభిక్ష పెట్టారు. ఈ నిర్ణయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించుకున్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులు రక్తంతో తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!