Russia-Ukraine War: రష్యా ‘జెనోసైడ్’కు పాల్పడుతోంది… జెలన్ స్కీ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు దాటుతోంది. అయినా రష్యా తన దురాక్రమణను ఆపడం లేదు. ముందుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకుందాం అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ బలగాలు ఎదురొడ్డి నిలిచాయి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాల ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరించాయి. దీంతో కీవ్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో మారణహోమాన్ని సృష్టిస్తోంది.
తూర్పు ప్రాంతంలోనో డోన్ బాస్ లో రష్యా జెనోసైడ్ ( జాతి నిర్మూలన)కు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశాడు. రష్యా తన విధానాలను స్పష్టంగా అమలు చేస్తుందని విమర్శించారు.డోన్ బాస్ ప్రాంతాన్ని జనవాసాలు లేకుండా రష్యా దురాక్రమణకు పాల్పడుతోందని జెలన్ స్కీ అన్నాడు. తూర్పు ప్రాంతాన్ని రష్యా బూడిదగా మార్చాలని అనుకుంటుందని ఆరోపించారు. మా ప్రజలను బహిష్కరించడం, సామూహిక హత్యలకు పాల్పడడం రష్యా అనుసరిస్తున్న మారణహోమానికి స్పష్టమైన విధానం అని జెలన్ స్కీ అన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Pakistan: ఉద్రిక్తతల వేళ టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ పై భారీగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ పై జరిగిన దాడిలో 5 ఏళ్ల చిన్నారితో పాటు ఎనిమిది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. తూర్పు ప్రాంతంలోని నగరమైన లైసిచాన్స్క్ పై భారీగా ధాడులు చేసిందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డోన్ బాస్ లోని లుహాన్స్క్ ప్రాంతలో సీవీరోడోనెట్స్క్ ప్రాంతంపై రష్యా బలగాలు పట్టు సాధించాయి. మరోవైపు రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఉక్రెయిన్ సరిహద్దులకు తనమ సైన్యాన్ని పంపుతున్నట్లు చెప్పాడు. అయితే కీవ్ లోని ఉక్రెయిన్ అధికారులు దీన్ని కొట్టిపారేశారు. అయితే రష్యా బలగాలు బెలారస్ నేలను వాడుకుంటూ ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!