Crude oil: క్రూడాయిల్ మంటలు.. పదేళ్ల గరిష్టాన్ని తాకేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎంట్రీ సమయంలో… లాక్డౌన్లు, కట్టడి చర్యల కారణంగా దారుణంగా పడిపోయిన కూడాయిల్ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది.. ఆ యుద్ధం ప్రభావం ఇప్పుడు ముడిచమురుపై పడుతోంది.. దీంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది.. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం ఆందోళన కలిగించే విషయం.. మరోవైపు.. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. ఇది కూడా ముడి చమురుపై తీవ్రంగా పడుతోంది.. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్లకు పెరగ్గా.. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 2.67శాతం పెరిగి 113.6 డాలర్లకు చేరుకుంది.. బ్రెంట్ క్రూడ్ ధర గరిష్ఠంగా పెరగడం 2011 తర్వాత ఇదే తొలిసారి కావడం చర్చించుకోదగిన విషయం.
Read Also: Child Covid Vaccination: పిల్లలకు వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
బ్రెంట్ క్రూడ్ ధర 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్కు 100 డాలర్లు దాటేసింది.. గత 4 నెలలుగా క్రమంగా పెరుగుతూ పోతోంది.. బ్రెంట్ క్రూడ్ ధర డిసెంబర్లో 10.22శాతం, జనవరిలో ఏకంగా 17 శాతం, ఫిబ్రవరి నెలలో 10.7 శాతం, మార్చిలో అయితే ఇప్పటికే 16 శాతానికిపైగా పెరిగి అందరినీ భయపెడుతోంది.. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ముడిచమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. ఇవాళ ఏకంగా పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ గరిష్ఠ స్థాయికి చేరిన పిడుగులాంటి వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. వీటి ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.. ఇప్పటికే భారత్లో పెట్రోల్ ధరలు పెరగాల్సింది.. కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఆపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7తో ముగియనుంది.. ఇక, 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.. మొత్తంగా 7వ తేదీ తర్వాత కానీ, 10 తర్వాత అయినా.. భారీగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!