Crude oil: క్రూడాయిల్ మంటలు.. పదేళ్ల గరిష్టాన్ని తాకేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎంట్రీ సమయంలో… లాక్డౌన్లు, కట్టడి చర్యల కారణంగా దారుణంగా పడిపోయిన కూడాయిల్ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది.. ఆ యుద్ధం ప్రభావం ఇప్పుడు ముడిచమురుపై పడుతోంది.. దీంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది.. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం ఆందోళన కలిగించే విషయం.. మరోవైపు.. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. ఇది కూడా ముడి చమురుపై తీవ్రంగా పడుతోంది.. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్లకు పెరగ్గా.. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 2.67శాతం పెరిగి 113.6 డాలర్లకు చేరుకుంది.. బ్రెంట్ క్రూడ్ ధర గరిష్ఠంగా పెరగడం 2011 తర్వాత ఇదే తొలిసారి కావడం చర్చించుకోదగిన విషయం.
Read Also: Child Covid Vaccination: పిల్లలకు వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
బ్రెంట్ క్రూడ్ ధర 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్కు 100 డాలర్లు దాటేసింది.. గత 4 నెలలుగా క్రమంగా పెరుగుతూ పోతోంది.. బ్రెంట్ క్రూడ్ ధర డిసెంబర్లో 10.22శాతం, జనవరిలో ఏకంగా 17 శాతం, ఫిబ్రవరి నెలలో 10.7 శాతం, మార్చిలో అయితే ఇప్పటికే 16 శాతానికిపైగా పెరిగి అందరినీ భయపెడుతోంది.. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ముడిచమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. ఇవాళ ఏకంగా పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ గరిష్ఠ స్థాయికి చేరిన పిడుగులాంటి వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. వీటి ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.. ఇప్పటికే భారత్లో పెట్రోల్ ధరలు పెరగాల్సింది.. కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఆపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7తో ముగియనుంది.. ఇక, 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.. మొత్తంగా 7వ తేదీ తర్వాత కానీ, 10 తర్వాత అయినా.. భారీగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!