Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..
- పాకిస్తాన్ను వణికిస్తున్న తాలిబాన్లు..
- ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్ మ్యాచ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అనవసరంగా ఆఫ్ఘానిస్తాన్లోని తాలిబాన్లను పాకిస్తాన్ పెట్టుకుంది. ఇప్పుడు అనుభవిస్తోంది. తాలిబాన్లు పాకిస్తాన్కు దళాలకు చుక్కలు చూపెడుతున్నారు. పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్లోని తాలిబాన్ సర్కార్ సహాయం చేస్తుందని చెబుతూ, పాక్ ఆ దేశ రాజధాని కాబూల్తో సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి, సాధారణ ప్రజల్ని హతమారుస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ బలగాలు కూడా అంతే ధీటుగా పాక్పై విరుచుకుపడుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్లపై పడింది. తాలిబాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరుగుతాయని తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు,ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్పై జరుగుతున్న నిరంతర దాడుల కారణంగా తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
PSL 2026 మార్చి 26న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సారి కేవలం రెండు నగరాల్లో మాత్రమే ఈ టోర్నీ మ్యాచ్లు జరుగుతాయి. కేవలం కరాచీ, లాహోర్లోనే మ్యాచులు నిర్వహించనున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్టేడియాలకు ప్రేక్షకుల్ని అనుమతించబోమని పీసీసీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ విలేకరుల సమావేశంలో చెప్పారు. దీంతో పాటు పీఎస్ఎల్ ఓపెనింగ్ సెరమని కూడా జరగదని ఆయన స్పష్టం చేశారు.
“PSL మా అంతర్జాతీయ బ్రాండ్, ఇందులో అనేక మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. మేము ఈ టోర్నమెంట్ను రద్దు చేయలేము. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, 25,000 నుండి 30,000 మంది ప్రజలను స్టేడియాల్లోకి అనుమతించడం సాధ్యం కాదు.ఈ నిర్ణయం తీసుకునే ముందు, పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, భద్రతా సంస్థలతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించాము” అని ఆయన వివరించారు. దేశ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
ఈ ఏడాది పీఎస్ఎల్ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్లు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 8 జట్లు-హైదరాబాద్ కింగ్స్మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి పిండిస్ జట్లు పాల్గొంటున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!