IND vs AUS: మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
India Lost 3rd ODI Against Australia: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా కుదిర్చిన 270 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. ఆస్ట్రేలియా 21 పరుగులతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇది ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం కావడంతో.. సిరీస్ ఆసీస్ కైవసం అయ్యింది. మొదట్లో ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కాస్త ఆశాజనకమైన ప్రదర్శనని కనబర్చడంతో.. సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి, మ్యాచ్ని తమవైపుకు తిప్పుకున్నారు.
US Dentist Crime: క్లూ లేకుండా భార్యని చంపాడు.. కానీ చివరికి అలా బుక్కయ్యాడు
Also Read
- Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
- Muttiah Muralitharan: "ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?".. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 49 ఓవర్లలో 269 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేదు. మిచెల్ మార్ష్ ఒక్కడే 47 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడు. అయితే.. మిగతా బ్యాటర్లు కొద్దోగొప్పో పరుగులతో బాగానే నెట్టుకొచ్చారు. మరీ పేలవ ప్రదర్శన కనబర్చకుండా.. తమ జట్టుకి గౌరవప్రదమైన స్కోరు జోడించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. స్టీవ్ స్మిట్ ఒక్కడే డకౌట్గా వెనుదిరగగా.. మిగతా బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్లే కొట్టారు. చివరికి బౌలర్లు సైతం.. జట్టుకి స్కోరుని జోడించడంలో తమవంతు కృషి చేశారు. అందుకే.. ఏ ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేయగలిగింది. భారత్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని పెట్టగలిగింది.
Extramarital Affair: భర్తని వదిలి ప్రియునితో కాపురం.. కట్ చేస్తే ఊహించని దారుణం
ఇక 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. శుభారంభాన్నే అందించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి మొదట్లో పరుగుల వర్షం పారించారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక స్కోర్ బోర్డు నత్తనడకగా సాగింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మరో వికెట్ పడనివ్వకుండా.. తమ ఇన్నింగ్స్ని నిదానంగా కొనసాగించారు. ఈ క్రమంలో కోహ్లీ (54) అర్థశతకంతో మెరిశాడు. వీళ్లు ఔటయ్యాకే మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. హార్దిక్ పాండ్యా (40) ఒక్కడే జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు. మిగతా వాళ్లెవ్వరూ సరిగ్గా రాణించలేకపోయారు. మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు.
Punjab Kings: పంజాబ్ కింగ్స్కు ఎదురుదెబ్బ.. ఆ విధ్వంసకర బ్యాటర్ దూరం
భారత్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆదుకున్న అక్షర్ (2), జడేజా (18) సైతం చేతులెత్తేశారు. సరైన సమయంలో ఆసీస్ బౌలర్లు తమ మాయాజాలం చూపించి.. భారత్ని కష్టాల్లో పడేసి, మ్యాచ్ని తమవైపుకు తిప్పుకున్నారు. చివర్లో వచ్చిన మహమ్మద్ షమీ ఒక సిక్స్, మరో ఫోర్తో ఆశలు రేకెత్తించాడు కానీ.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చకచకా వికెట్లు పడ్డాయి. దీంతో.. భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. కీలక సమయంలో ఆడకపోవడంతో, గెలవాల్సిన మ్యాచ్ని భారత్ చేజేతులా కోల్పోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!