Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pm Modi To Visit Samarkand For 22nd Summit Of Sco Council Of Heads Of State

SCO Summit: ఆ సమ్మిట్ కోసం సమర్‌కండ్‌కు ప్రధాని.. ఒకే వేదికపై మోడీ, జిన్‌పింగ్‌, పుతిన్‌

Published Date :September 11, 2022 , 10:09 pm
By Mahesh Jakki
SCO Summit: ఆ సమ్మిట్ కోసం సమర్‌కండ్‌కు ప్రధాని.. ఒకే వేదికపై మోడీ, జిన్‌పింగ్‌, పుతిన్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

SCO Summit: ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ సదస్సుకు చైనా, రష్యా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్తాన్‌ ప్రధానులు హాజరుకానుండడమే. షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరయ్యేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో ప్రధాని మోడీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సమర్‌కండ్‌లో పర్యటించనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 15 దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఇంత మంది దేశాధినేతలు హాజరుకానున్న అతిపెద్ద సదస్సు ఇదే కానుండడం గమనార్హం. చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ ఈ సదస్సులో ప్రధాని మోదీ హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సమ్మిట్‌కు సంస్థ సభ్య దేశాల నాయకులు, పరిశీలకులు, షాంఘై సహకార సంస్థ సెక్రటరీ జనరల్, షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం (RATS) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు, ఇతర ఆహ్వానిత అతిథులు హాజరవుతారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ నెల 14న ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌కు వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. ఇదే సమయంలో మోదీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాకిస్థాన్‌, చైనాల అధినేతలు సమావేశమయ్యే విషయంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.

Also Read

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
  • Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
  • Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్‌తో మనం పోల్చుకోలేము

Ukraine-Russia War: యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బ.. కీలక నగరాన్ని చేజిక్కించుకున్న ఉక్రెయిన్

చైనా నేతృత్వంలో 2001లో ఏర్పాటైన షాంఘై సహకార సంస్థలో భారత్‌, రష్యాతో పాటు పాకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, తజకిస్థాన్‌, కజికిస్థాన్‌లు పూర్తిస్థాయి సభ్య దేశాలుగా ఉన్నాయి. అఫ్ఘనిస్థాన్‌తో పాటు బెలారస్‌, ఇరాన్‌, మంగోలియా దేశాలు ఎస్‌సీవో కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు దేశాలు పరీశీలకులుగా ఉన్నాయి. అర్మేనియా, అజర్‌బైజాన్‌, కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, టర్కీ దేశాలు ఈ కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి. ‘నాటో’కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్‌ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్‌ కూడా ఎస్‌సీఓలో చేరింది. ఈ సదస్సు ఏడాదికి ఓ సారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతుండగా… వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • india
  • pm modi samarkand visit
  • PM Narendra Modi
  • Russia

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions