PM Modi: కెనడా చేరుకున్న మోడీ.. జీ7 సదస్సుకు హాజరు
- కెనడా చేరుకున్న మోడీ
- 2 రోజుల పాటు పర్యటన
- జీ7 సదస్సుకు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈరోజు, రేపు కెనడాలో పర్యటించనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు మోడీ కెనడాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచమంతా సర్వత్రా ఆసక్తిగా చూస్తోంది. ఇక ప్రధాని మోడీ 2019 నుంచి జీ7 సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Seven Hills Express: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తు్న్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్ గ్రామంలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అధికారిక ఆహ్వానం మేరకు 2015 తర్వాత ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్న తొలి పర్యటన ఇది.
ఇది కూడా చదవండి: Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..!
జీ 7 సదస్సు సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్తో సహా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనే కొందరు నాయకులంతా ఒకచోట చేరనున్నారు. ప్రధానంగా ఈ సమ్మిట్లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. వాస్తవానికి భారత దేశం జీ7లో సభ్యత్వం లేదు. అయినా కూడా 2019 నుంచి మోడీకి ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రస్తుతం కెనడా ఆహ్వానం మేరకు వెళ్లారు. ఇక ఇటీవల భారతదేశం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో తొలిసారి మోడీ అంతర్జాతీయ పర్యటన చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రధాని మోడీ లేవనెత్తే అవకాశం ఉంది.
జీ7 సమ్మిట్ అజెండా
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. అలాగే ట్రంప్ విధించిన సుంకాలు. భౌగోళికంగా చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి