Putin: “పీఎం మోడీ ఈస్ రైట్”.. రష్యా అధినేత ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: భారత మిత్రదేశం రస్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ‘‘పీఎం మోడీ ఈస్ రైట్’’ అంటూ ఓ సదస్సులో ప్రశంసించారు. రష్యా వ్లాడివోస్టాక్ నగరంలో 8వ ‘ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని మోడీ ప్రోత్సహిస్తూ సరైన పనిచేస్తున్నారని అన్నారు. కార్ల తయారీపై మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దేశీయంగా తయారైన ఆటోమొబైల్స్ ని వినియోగించాలని, ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత్ ఇప్పటికే ఈ విధానాన్ని చేపడుతోందని అన్నారు.
Read Also: NEET: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు..
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
ప్రస్తుతం రష్యాకు దేశీయంగా తయారుచేసిన కార్లు లేవు, కానీ ఇప్పుడు మేం చేస్తున్నామని, రష్యా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మెర్సిడెస్, ఆడి కార్లతో పోలిస్తే ఇవి నిరాడంబరంగా 1990లా ఉంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశం, ఆ దేశంలో నిర్మించిన కార్ల వినియోగంపై దృష్టి సారించిందని పుతిన్ కొనియాడారు. ఇదే విధంగా రష్యాలో తయారైన ఆటోమొబైల్స్ ని వినియోగించడం మంచిదని అన్నారు. తాజాగా జీ20 సమావేశంలో యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్, యూరప్, ఇండియా దేశాలు కలిసి ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్’ ఎకనామిక్ కారిడార్(IMEC)ని ప్రారంభించాయని, ఇది రష్యాకు ఆటంకం కలిగించేది కాదని, రష్యాకు దీనితో ప్రయోజనం ఉంటుందని పుతిన్ అన్నారు.
ఈ ఎకనామిక్ కారిడార్ ముందుగా యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, భారత్ అంగీకరించిన తర్వాత చివరకు అమెరికా కూడా వచ్చి చేరిందని పుతిన్ వెల్లడించారు. రష్యా దేశానికి లాజిస్టిక్స్ను అభివృద్ధి చేయడంలో IMEC సహాయం చేస్తుందని రష్యా అధ్యక్షుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లుగా చర్చల్లో ఉందని తెలిపారు. జీ20 వేదికగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్పై వివిధ దేశాలు ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో మెగా రైల్వే, షిప్పింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. దీని వల్ల భారత్తో అరబ్, గల్ఫ్, యూరప్ దేశాలు అనుసంధానం కానున్నాయి.
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!