PM Modi: బ్రిక్స్ వేదికగా పాకిస్థాన్పై నిప్పులు చెరిగిన మోడీ
- బ్రిక్స్ వేదికగా పాకిస్థాన్పై నిప్పులు చెరిగిన మోడీ
- బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్థాన్పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దాయాది దేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ మాత్రం మద్దతుదారు అని తెలిపారు. బాధితులను మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని చెప్పారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భారదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ధన్యవాదాలు చెప్పారు. ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద వ్యాప్తికి వ్యతిరేకంగా మాట్లాడని.. ఏమీ చేయని వారిని కూడా పరోక్షంగా మోడీ ప్రస్తావించారు. ఇక పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో భారత్ స్పష్టమైన ఆధారాలను చూపించింది.
పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం మానవాళిపై జరిగిన దాడిగా మోడీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ ఘటన అమానుషం, పిరికితనంతో కూడిన ఉగ్రదాడిగా పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుని బోధనల నుంచి ప్రేరణ పొంది.. భారతదేశం శాంతి మార్గాన్ని కొనసాగిస్తుందన్నారు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మానవాళి సంక్షేమానికి శాంతి ఉత్తమ మార్గంగా మిగిలిపోయిందని చెప్పారు.
Also Read
ఇది కూడా చదవండి: YS Jagan: నేటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. రేపు ఇడుపులపాయకు మాజీ సీఎం..
2026లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ గ్రూప్ నాయకులంతా ఖండించారు. నేరపూరితమైనది, అన్యాయమైనదిగా రియో డి జనీరో డిక్లరేషన్ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. ‘‘2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలిక, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, సురక్షిత స్వర్గధామాలు వంటి అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము.’’ అని పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Samantha : ‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సమంత
తాజావార్తలు
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!