Trump-Jinping: ట్రంప్-జిన్పింగ్ మధ్య కీలక సంభాషణ.. ఏప్రిల్లో చైనాలో పర్యటన
- ట్రంప్-జిన్పింగ్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ
- ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్న ట్రంప్
- 2026 చివరిలో వాషింగ్టన్లో పర్యటించనున్న జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జన్పింగ్ మధ్య సోమవారం ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి మధ్య రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావనకు రావడం విశేషం.
ఇది కూడా చదవండి: Mumbai airport: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్పోర్ట్.. దేంట్లో అంటే..!
Also Read
వాణిజ్య యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇద్దరి మధ్య ముఖాముఖి భేటీ జరగలేదు. దీంతో ఇటీవలే తొలిసారి దక్షిణకొరియాలో ఇద్దరు అధ్యక్షులు కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం చైనాపై 10 శాతం టారిఫ్ తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరించనున్న మోడీ.. విశిష్టతలు ఇవే!
ఇక తాజా ఫోన్ కాల్ సంభాషణలో కూడా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు బీజింగ్కు రావాల్సిందిగా ట్రంప్ను జిన్పింగ్ ఆహ్వానించారు. దీంతో జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్లో బీజింగ్ వస్తానని ట్రంప్ తెలియజేశారు. అలాగే వాషింగ్టన్ రావాల్సిందిగా జిన్పింగ్ను ట్రంప్ ఆహ్వానించారు. ఈ మేరకు చైనా విదేశాంగ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణకొరియాలో సాధించిన సానుకూల సంబంధాలు ఇరు దేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. ఇక చర్చల వివరాలు బయటకు చెప్పకపోయినా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక ఫోన్ కాల్ సంభాషణ జరిగిందని వైట్హౌస్ స్పష్టం చేసింది. జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్లో ట్రంప్ బీజింగ్ సందర్శిస్తారని తెలిపింది.
ఇక ఇద్దరి మధ్య తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం గురించి, ఫెంటానిల్ అక్రమ రవాణ, రైతులకు సంబంధించిన ఒప్పందాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ సంభాషణ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. చైనాతో మా సంబంధం చాలా బలంగా ఉందని.. రైతుల కోసం కీలక ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్లో చైనాను సందర్శిస్తానని.. అలాగే ఏడాది చివరిలో జిన్పింగ్ అమెరికా సందర్శిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక తైవాన్పై చైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతనంగా ఎన్నికైన జపాన్ ప్రధాని సనే తకైచి హెచ్చరించారు. తైవాన్పై దాడి జరిగితే టోక్యో సైనిక జోక్యం ఉంటుందని తెలిపారు. జపాన్ ప్రధాని ప్రకటనపై బీజింగ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తైవాన్ తమ సొంతం అని చైనా వాదిస్తుండగా.. లేదు.. లేదు తైవాన్ తమదంటూ జపాన్ వాదిస్తోంది. తైవాన్ను అమెరికా సార్వభౌమ రాజ్యంగా అధికారికంగా గుర్తించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!