Mumbai airport: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్పోర్ట్.. దేంట్లో అంటే..!
- ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్పోర్ట్
- పాత రికార్డ్ను తిరగరాసిన విమానాశ్రయం
- ఢిల్లీ తర్వాత అత్యంత రద్దీగా మారిన ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే కొత్త రికార్డ్ను నమోదు చేసింది. నవంబర్ 21, 2025న 24 గంటల్లో 1,036 విమాన రాకపోకలు నిర్వహించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరించనున్న మోడీ.. విశిష్టతలు ఇవే!
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. ప్రపంచంలోనే పెద్ద విమానాశ్రయాల వరుసలో ముంబై ఎయిర్పోర్టు నిలుస్తుంది. ఢిల్లీ, లండన్, దుబాయ్, న్యూయార్క్ మాదిరిగా రెండు రన్వేలు ఒకేసారి పని చేయగల సామర్థ్యం ముంబై ఎయిర్పోర్టు సొంతం. దీంతో నవంబర్ 21న ప్రతి 100 సెకన్లలోపు 1,036 టేకాఫ్లు, ల్యాండింగ్లు జరిగాయి. దీంతో మరోసారి ముంబై ఎయిర్పోర్టు తన రికార్డ్ను తానే తిరిగరాసింది. నవంబర్ 21, 2023లో కూడా 1,032 విమానాల రాకపోకలు జరిగాయి. తాజాగా 1,036 విమాన రాకపోకలు జరిగించి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇందులో 755 దేశీయ విమానాలు, 281 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. 520 వచ్చే విమానాలు, 516 టేకాఫ్ అయిన విమానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Meerut: భర్తను చంపి డ్రమ్లో పెట్టిన ముస్కాన్ తల్లైంది.. కుమార్తె జననం.. ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో జైలులోనే
ఇక నవంబర్ 21న 170,488 మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి. దేశీయ మార్గాల్లో 121,527 మంది ప్రయాణికులు, 48, 961 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణం చేశారు. దేశీయ మార్గాల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్కతా నగరాలకు ఈ ప్రయాణాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక అంతర్జాతీయంగా దుబాయ్, అబుదాబి, లండన్ హీత్రో, దోహా, జెడ్డా వంటి నగరాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. జనవరి 11, 2025న కూడా ముంబై ఎయిర్పోర్టు నుంచి అత్యధిక సంఖ్యలో ప్రయాణం చేశారు. ఆ ఒక్క రోజే 170,516 మంది ప్రయాణించారు. దేశంలో సహజంగా ఢిల్లీలో రద్దీగా ఉంటుంది. అలాంటిది ముంబై నుంచి కూడా ఆ స్థాయిలో ప్రయాణాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!