Pannun murder plot: నిఖిల్ గుప్తా కేసులో ‘భారత అధికార పరిధి’ లేదు.. స్పష్టం చేసిన చెక్ రిపబ్లిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో అమెరికా సూచనల మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ గుప్తా ప్రేగ్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో భారత్కి ఎలాంటి అధికార పరిధి లేదని చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తేల్చి చెప్పింది.
నిఖిల్ గుప్తాకు సంబంధించిన కేసులో భారతదేశంలోని న్యాయ అధికారులకు ‘‘ అధికారం లేదు’’ అని చెక్ రిపబ్లిక్ చెప్పింది. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరతూ నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజుల తర్వాత చెక్ అధికారుల నుంచి ఈ స్పందన వచ్చింది.
Also Read
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
Read Also: Cyber Attacks: దేశంలో ప్రతి నిమిషానికి 761 సైబర్ దాడులు, 2023లో 40 కోట్లకు!
అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ హత్యకు కుట్రపన్నిట్లు నిఖిల్ గుప్తా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా సమచారంతో చెక్ అధికారులు ఆరు నెలల క్రితం గుప్తాను అరెస్ట్ చేశారు. ఇతనిని అమెరికాకు అప్పగించేందుకు యూఎస్-చెక్ దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గత వారం నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులు భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పగింత ప్రక్రియలో జోక్యం చేసుకునేలా, ఈ కేసులో న్యాయపరమైన విచారణ జరిగేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పన్నూ హత్యకుట్రలో నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వ ఉద్యోగి సహకరించారంటూ అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ హత్య కుట్రపై విచారించేందుకు భారత్ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది.
భారత జోక్యంపై చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ప్రతినిధి వ్లాదిమిర్ రెప్కా మాట్లాడుతూ.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని ఏ న్యాయపరమైన అధికారులకు ఈ విషయంలో ఎలాంటి అధికార పరిధి లేదని, ఈ కేసు చెక్ రిపబ్లిక్ అధికార పరిధిలో ఉందని చెప్పారు. జైలులో గుప్తాకు సరైన ఆహారం అందించడం లేదన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!