Cyber Attacks: దేశంలో ప్రతి నిమిషానికి 761 సైబర్ దాడులు, 2023లో 40 కోట్లకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
761 Cyber Attacks Every Minute In 2023: భారతదేశంలో, 2023లో దాదాపు 85 లక్షల పరికరాలపై 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి. అంటే నిమిషానికి 761 సైబర్ దాడులు జరిగాయి. వీటిలో సూరత్ (15 శాతం), బెంగళూరు (14 శాతం)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి పైగా మీడియా – నెట్వర్క్ డ్రైవ్లకు సంబంధించినవి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI) నివేదిక ప్రకారం, దాదాపు 25 శాతం దాడులు ఇమెయిల్లు, వెబ్సైట్లలోని హానికరమైన లింక్లపై క్లిక్ చేయడం వల్లనే జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ పరికరాల ద్వారా కూడా నెలకు సగటున మూడు దాడులు జరిగాయని తేలింది. సదరు రిపోర్టు ప్రకారం, నకిలీ యాప్లను మిలియన్ల మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు, వాటి ద్వారా వారి మొబైల్స్ హ్యాక్ చేయబడ్డాయి.
December Bonanza Sale: అమెజాన్లో మరో సేల్ మొదలైంది.. ఈ ప్రొడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల మాట్లాడుతూ దేశంలో అంతరిక్ష సంస్థ ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటోందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ 16వ ఎడిషన్ కేరళలో జరిగింది. రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ముగింపు సమావేశంలో సోమనాథ్ అన్నారు. సైబర్ నిందితులు అత్యాధునిక సాఫ్ట్వేర్ – చిప్లను ఉపయోగిస్తున్నారు, కానీ ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇస్రో సిద్ధమైంది. మేము బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ని కలిగి ఉన్నాము, రాకెట్లోని హార్డ్వేర్ చిప్ల భద్రతపై ఇస్రో దృష్టి సారించిందని ఇందుకోసం వివిధ పరీక్షల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఇక భారతదేశంలో, గత ఆరు నెలల్లో ప్రతి వారం సైబర్ దాడుల వల్ల మూడు రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇందులో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన – వినియోగాలు ఉన్నాయి. చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో, భారతదేశంలో వారానికి సగటున 2,157 సైబర్ దాడులు జరిగాయి, అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై 1,139 దాడులు జరిగాయి. రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్ – రవాణా రంగాలు కూడా సైబర్ సెక్యూరిటీపై వేగంగా ముందుకు సాగాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!