Cyber Attacks: దేశంలో ప్రతి నిమిషానికి 761 సైబర్ దాడులు, 2023లో 40 కోట్లకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
761 Cyber Attacks Every Minute In 2023: భారతదేశంలో, 2023లో దాదాపు 85 లక్షల పరికరాలపై 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి. అంటే నిమిషానికి 761 సైబర్ దాడులు జరిగాయి. వీటిలో సూరత్ (15 శాతం), బెంగళూరు (14 శాతం)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి పైగా మీడియా – నెట్వర్క్ డ్రైవ్లకు సంబంధించినవి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI) నివేదిక ప్రకారం, దాదాపు 25 శాతం దాడులు ఇమెయిల్లు, వెబ్సైట్లలోని హానికరమైన లింక్లపై క్లిక్ చేయడం వల్లనే జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ పరికరాల ద్వారా కూడా నెలకు సగటున మూడు దాడులు జరిగాయని తేలింది. సదరు రిపోర్టు ప్రకారం, నకిలీ యాప్లను మిలియన్ల మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు, వాటి ద్వారా వారి మొబైల్స్ హ్యాక్ చేయబడ్డాయి.
December Bonanza Sale: అమెజాన్లో మరో సేల్ మొదలైంది.. ఈ ప్రొడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- 8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల మాట్లాడుతూ దేశంలో అంతరిక్ష సంస్థ ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటోందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ 16వ ఎడిషన్ కేరళలో జరిగింది. రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ముగింపు సమావేశంలో సోమనాథ్ అన్నారు. సైబర్ నిందితులు అత్యాధునిక సాఫ్ట్వేర్ – చిప్లను ఉపయోగిస్తున్నారు, కానీ ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇస్రో సిద్ధమైంది. మేము బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ని కలిగి ఉన్నాము, రాకెట్లోని హార్డ్వేర్ చిప్ల భద్రతపై ఇస్రో దృష్టి సారించిందని ఇందుకోసం వివిధ పరీక్షల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఇక భారతదేశంలో, గత ఆరు నెలల్లో ప్రతి వారం సైబర్ దాడుల వల్ల మూడు రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇందులో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన – వినియోగాలు ఉన్నాయి. చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో, భారతదేశంలో వారానికి సగటున 2,157 సైబర్ దాడులు జరిగాయి, అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై 1,139 దాడులు జరిగాయి. రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్ – రవాణా రంగాలు కూడా సైబర్ సెక్యూరిటీపై వేగంగా ముందుకు సాగాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!