Cyber Attacks: దేశంలో ప్రతి నిమిషానికి 761 సైబర్ దాడులు, 2023లో 40 కోట్లకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
761 Cyber Attacks Every Minute In 2023: భారతదేశంలో, 2023లో దాదాపు 85 లక్షల పరికరాలపై 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి. అంటే నిమిషానికి 761 సైబర్ దాడులు జరిగాయి. వీటిలో సూరత్ (15 శాతం), బెంగళూరు (14 శాతం)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి పైగా మీడియా – నెట్వర్క్ డ్రైవ్లకు సంబంధించినవి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI) నివేదిక ప్రకారం, దాదాపు 25 శాతం దాడులు ఇమెయిల్లు, వెబ్సైట్లలోని హానికరమైన లింక్లపై క్లిక్ చేయడం వల్లనే జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ పరికరాల ద్వారా కూడా నెలకు సగటున మూడు దాడులు జరిగాయని తేలింది. సదరు రిపోర్టు ప్రకారం, నకిలీ యాప్లను మిలియన్ల మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు, వాటి ద్వారా వారి మొబైల్స్ హ్యాక్ చేయబడ్డాయి.
December Bonanza Sale: అమెజాన్లో మరో సేల్ మొదలైంది.. ఈ ప్రొడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్
Also Read
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
- Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
- Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్
- Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్నెస్ ట్రాకర్ ..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల మాట్లాడుతూ దేశంలో అంతరిక్ష సంస్థ ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటోందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ 16వ ఎడిషన్ కేరళలో జరిగింది. రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ముగింపు సమావేశంలో సోమనాథ్ అన్నారు. సైబర్ నిందితులు అత్యాధునిక సాఫ్ట్వేర్ – చిప్లను ఉపయోగిస్తున్నారు, కానీ ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇస్రో సిద్ధమైంది. మేము బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ని కలిగి ఉన్నాము, రాకెట్లోని హార్డ్వేర్ చిప్ల భద్రతపై ఇస్రో దృష్టి సారించిందని ఇందుకోసం వివిధ పరీక్షల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఇక భారతదేశంలో, గత ఆరు నెలల్లో ప్రతి వారం సైబర్ దాడుల వల్ల మూడు రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇందులో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన – వినియోగాలు ఉన్నాయి. చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో, భారతదేశంలో వారానికి సగటున 2,157 సైబర్ దాడులు జరిగాయి, అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై 1,139 దాడులు జరిగాయి. రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్ – రవాణా రంగాలు కూడా సైబర్ సెక్యూరిటీపై వేగంగా ముందుకు సాగాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?