Article 370: ఆర్టికల్ 370 రద్దు@ మూడేళ్లు.. భారత్ పరువు తీసేందుకు సిద్ధమైన పాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ను పరువు తీయడమే లక్ష్యంగా పాకిస్థాన్ టూల్కిట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. చైనా, బెల్జియం, జపాన్, ఉక్రెయిన్, బెర్మింగ్హామ్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జర్మనీలలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు భారత ప్రభుత్వం “కశ్మీర్ ప్రజలపై అణచివేస్తోందని” ఎత్తిచూపటంతో పాటు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముసాయిదా సందేశాలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నాయి. పైన పేర్కొన్న దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలను కూడా పాక్ ప్లాన్ చేసింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి యూరోపియన్ దేశాల నుండి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది.
స్వీడన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఆగస్టు 5న కశ్మీర్పై నిరసనలకు అక్కడి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది. అంతే కాదు కశ్మీర్కు సంబంధించి స్వీడిష్ పత్రికల్లో భారత్పై దుష్ప్రచారం చేసే బాధ్యతను కూడా పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి అప్పగించింది. గతేడాది కూడా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో భారత్ను అంతర్జాతీయంగా పరువు తీయడానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర చట్టాల పొడిగింపు, అక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జమ్మూ కశ్మీర్ అంతటా సమసమాజాన్ని స్థాపించింది. అయితే అనేక చట్టాల అమలు వల్ల జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇటీవల ప్రముఖ వార్థా సంస్థ పీటీఐ వెల్లడించింది. .పాక్ ఆక్రమిత-జమ్మూ కశ్మీర్, ఛంబ్, పశ్చిమ పాకిస్థానీ శరణార్థులతో వంటి సమాజంలోని వర్గాలు కేంద్ర చట్టాల పొడిగింపుతో తగిన ప్రయోజనాలను పొందుతున్నారని తెలిపింది. ఆగష్టు 5, 2019 న, BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను రద్దు చేసింది. పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ &కశ్మీర్, లడఖ్. ఈ నిర్ణయాన్ని తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో పిటిషన్లను తిరస్కరించింది. మరోవైపు సోషల్ మీడియాలో భారత వ్యతిరేక కంటెంట్ను సర్క్యులేట్ చేయడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి దేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక పత్రాన్ని సిద్ధం చేశాయి.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!