Article 370: ఆర్టికల్ 370 రద్దు@ మూడేళ్లు.. భారత్ పరువు తీసేందుకు సిద్ధమైన పాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ను పరువు తీయడమే లక్ష్యంగా పాకిస్థాన్ టూల్కిట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. చైనా, బెల్జియం, జపాన్, ఉక్రెయిన్, బెర్మింగ్హామ్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జర్మనీలలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు భారత ప్రభుత్వం “కశ్మీర్ ప్రజలపై అణచివేస్తోందని” ఎత్తిచూపటంతో పాటు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముసాయిదా సందేశాలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నాయి. పైన పేర్కొన్న దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలను కూడా పాక్ ప్లాన్ చేసింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి యూరోపియన్ దేశాల నుండి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది.
స్వీడన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఆగస్టు 5న కశ్మీర్పై నిరసనలకు అక్కడి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది. అంతే కాదు కశ్మీర్కు సంబంధించి స్వీడిష్ పత్రికల్లో భారత్పై దుష్ప్రచారం చేసే బాధ్యతను కూడా పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి అప్పగించింది. గతేడాది కూడా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో భారత్ను అంతర్జాతీయంగా పరువు తీయడానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
Also Read
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
- Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
- USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర చట్టాల పొడిగింపు, అక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జమ్మూ కశ్మీర్ అంతటా సమసమాజాన్ని స్థాపించింది. అయితే అనేక చట్టాల అమలు వల్ల జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇటీవల ప్రముఖ వార్థా సంస్థ పీటీఐ వెల్లడించింది. .పాక్ ఆక్రమిత-జమ్మూ కశ్మీర్, ఛంబ్, పశ్చిమ పాకిస్థానీ శరణార్థులతో వంటి సమాజంలోని వర్గాలు కేంద్ర చట్టాల పొడిగింపుతో తగిన ప్రయోజనాలను పొందుతున్నారని తెలిపింది. ఆగష్టు 5, 2019 న, BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను రద్దు చేసింది. పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ &కశ్మీర్, లడఖ్. ఈ నిర్ణయాన్ని తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో పిటిషన్లను తిరస్కరించింది. మరోవైపు సోషల్ మీడియాలో భారత వ్యతిరేక కంటెంట్ను సర్క్యులేట్ చేయడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి దేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక పత్రాన్ని సిద్ధం చేశాయి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..