Article 370: ఆర్టికల్ 370 రద్దు@ మూడేళ్లు.. భారత్ పరువు తీసేందుకు సిద్ధమైన పాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ను పరువు తీయడమే లక్ష్యంగా పాకిస్థాన్ టూల్కిట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. చైనా, బెల్జియం, జపాన్, ఉక్రెయిన్, బెర్మింగ్హామ్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జర్మనీలలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు భారత ప్రభుత్వం “కశ్మీర్ ప్రజలపై అణచివేస్తోందని” ఎత్తిచూపటంతో పాటు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముసాయిదా సందేశాలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నాయి. పైన పేర్కొన్న దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలను కూడా పాక్ ప్లాన్ చేసింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి యూరోపియన్ దేశాల నుండి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది.
స్వీడన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఆగస్టు 5న కశ్మీర్పై నిరసనలకు అక్కడి పార్లమెంటు సభ్యులను ఆహ్వానించింది. అంతే కాదు కశ్మీర్కు సంబంధించి స్వీడిష్ పత్రికల్లో భారత్పై దుష్ప్రచారం చేసే బాధ్యతను కూడా పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి అప్పగించింది. గతేడాది కూడా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో భారత్ను అంతర్జాతీయంగా పరువు తీయడానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
Also Read
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
- Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర చట్టాల పొడిగింపు, అక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జమ్మూ కశ్మీర్ అంతటా సమసమాజాన్ని స్థాపించింది. అయితే అనేక చట్టాల అమలు వల్ల జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇటీవల ప్రముఖ వార్థా సంస్థ పీటీఐ వెల్లడించింది. .పాక్ ఆక్రమిత-జమ్మూ కశ్మీర్, ఛంబ్, పశ్చిమ పాకిస్థానీ శరణార్థులతో వంటి సమాజంలోని వర్గాలు కేంద్ర చట్టాల పొడిగింపుతో తగిన ప్రయోజనాలను పొందుతున్నారని తెలిపింది. ఆగష్టు 5, 2019 న, BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను రద్దు చేసింది. పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ &కశ్మీర్, లడఖ్. ఈ నిర్ణయాన్ని తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో పిటిషన్లను తిరస్కరించింది. మరోవైపు సోషల్ మీడియాలో భారత వ్యతిరేక కంటెంట్ను సర్క్యులేట్ చేయడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి దేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక పత్రాన్ని సిద్ధం చేశాయి.
తాజావార్తలు
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..