Jammu Kashmir: నాన్ లోకల్స్ పై ఉగ్రవాదుల గ్రెనెడ్ దాడి.. ఒకరి మృతి
Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు. ఆ సమయంలో కాశ్మీర్లోని హిందువులు పెద్ద ఎత్తున తమకు రక్షణ కల్పించాలని చెబుతూ ఆందోళనలు చేశారు.
ఇదిలా ఉంటే మరోసారి ముష్కరులు స్థానికేతరులే లక్ష్యంగా గ్రెనెడ్ దాడి చేశారు. పుల్వామా జిల్లాలోని గుదూరా ఏరియాలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో బీహార్ కు చెందిన ఓ కూలీ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన కూలీని బీహార్ కు చెందిన సక్వా పర్సా నివాసి మొహమ్మద్ ముంతాజ్ గా గుర్తించారు. గాయపడిన వారిలో బీహర్ కు చెందిన రాంపూర్ వాసులు మహ్మద్ ఆరిఫ్, మజ్బూల్ గా గుర్తించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇటీవల కాలంలో కాశ్మీర్ లోని ఉగ్రవాదులను భద్రతా బలగాలు వేటాడి మట్టుపెడుతున్నాయి. దీంతోె తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాదులు అమాయకులైన స్థానికేతరులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పనుల కోసం వచ్చే కూలీలే వీరికి టార్గెట్ అవుతున్నారు. గతంలో రాహుల్ భట్ అనే పండిట్ ను చంపిన తరువాత వరసగా ఉగ్రవాదులు ఇలానే కాశ్మీర్ యాంకర్, హిందూ ఉపాధ్యాయురాలిని టార్గెట్ చేసి చంపారు. అయితే వీరిని చంపిన ఉగ్రవాదులను రోజుల వ్యవధిలోనే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అయితే గత కొన్నాళ్లుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రర్ గ్రూపులు కాశ్మీర్ లో క్రియాశీలం కావాలని ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!