Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..
Pakistan: పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ హుస్సేన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవాలని తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా పాకిస్తాన్ మొత్తం కూడా మోడీ ఓడిపోయవాలని కోరుకుంటోందని అన్నారు. భారత్లో ఇండియా కూటమి గెలవాలని మద్దతు ఇచ్చాడు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తో్ందని విమర్శించారు.
ఫవాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల్లో నరేంద్రమోడీ ఓడిపోవాలని ప్రతీ పాకిస్తానీ కోరుకుంటున్నాడు’’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘భారత్లోని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని రెచ్చగొడుతోంది. పాకిస్థాన్కు భారత్పై ద్వేషం లేదు. వారు (బీజేపీ ప్రభుత్వం) ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి, ఈ భావజాలం ఉన్నవారిని ఓడించాలి’’ అని అన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Read Also: Ritika Sajdeh Trolls: రోహిత్ శర్మ సతీమణి రితికాపై ట్రోల్స్!
భారత్లో కొత్తగా ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నరేంద్రమోడీని ఓడించడానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులకు ‘‘శుభాకాంక్షలు’’ తెలిపారు. ఇటీవల ఫవాద్ హుస్సేన్ చౌదరి భారత రాజకీయాలపై ముఖ్యంగా బీజేపీ పార్టీని, ప్రధానిమోడీని వ్యతిరేకిస్తూ, ఇండియా కూటమికి మద్దతు పలుకుతున్నాడు. ‘‘సంపద పునర్విభజన’’ చేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇటీవల కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్-పాకిస్తాన్ బంధం బహిర్గతమైందని ఇటీవల ప్రధాని మోడీ స్పందించారు. ఇతని వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో పాక్ ప్రమేయాన్ని గతంలో ఫవాద్ అంగీకరించారని ఒక నెటిజన్ గుర్తు చేశారు. “మహాఘటబంధన్ మరియు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ గురించి మాకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీని దేశ వ్యతిరేక పార్టీ కేటగిరీలో పెట్టాం. పాకిస్థాన్లోని మైనారిటీలకు మీరు ఏమి చేశారో ముందుగా మీరు సమాధానం చెప్పాలి” అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ వ్యక్తి ఒక జోక్, కానీ వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాడు. నరేంద్ర మోదీని గద్దె దించాలని పాకిస్థాన్ ఎందుకు అంత ఆసక్తిగా ఉందో భారతీయ ఓటర్లకు తెలుసు, అలా జరగనివ్వరు!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో