Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ హుస్సేన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవాలని తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా పాకిస్తాన్ మొత్తం కూడా మోడీ ఓడిపోయవాలని కోరుకుంటోందని అన్నారు. భారత్లో ఇండియా కూటమి గెలవాలని మద్దతు ఇచ్చాడు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తో్ందని విమర్శించారు.
ఫవాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల్లో నరేంద్రమోడీ ఓడిపోవాలని ప్రతీ పాకిస్తానీ కోరుకుంటున్నాడు’’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘భారత్లోని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని రెచ్చగొడుతోంది. పాకిస్థాన్కు భారత్పై ద్వేషం లేదు. వారు (బీజేపీ ప్రభుత్వం) ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి, ఈ భావజాలం ఉన్నవారిని ఓడించాలి’’ అని అన్నారు.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Read Also: Ritika Sajdeh Trolls: రోహిత్ శర్మ సతీమణి రితికాపై ట్రోల్స్!
భారత్లో కొత్తగా ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నరేంద్రమోడీని ఓడించడానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులకు ‘‘శుభాకాంక్షలు’’ తెలిపారు. ఇటీవల ఫవాద్ హుస్సేన్ చౌదరి భారత రాజకీయాలపై ముఖ్యంగా బీజేపీ పార్టీని, ప్రధానిమోడీని వ్యతిరేకిస్తూ, ఇండియా కూటమికి మద్దతు పలుకుతున్నాడు. ‘‘సంపద పునర్విభజన’’ చేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇటీవల కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్-పాకిస్తాన్ బంధం బహిర్గతమైందని ఇటీవల ప్రధాని మోడీ స్పందించారు. ఇతని వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో పాక్ ప్రమేయాన్ని గతంలో ఫవాద్ అంగీకరించారని ఒక నెటిజన్ గుర్తు చేశారు. “మహాఘటబంధన్ మరియు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ గురించి మాకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీని దేశ వ్యతిరేక పార్టీ కేటగిరీలో పెట్టాం. పాకిస్థాన్లోని మైనారిటీలకు మీరు ఏమి చేశారో ముందుగా మీరు సమాధానం చెప్పాలి” అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ వ్యక్తి ఒక జోక్, కానీ వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాడు. నరేంద్ర మోదీని గద్దె దించాలని పాకిస్థాన్ ఎందుకు అంత ఆసక్తిగా ఉందో భారతీయ ఓటర్లకు తెలుసు, అలా జరగనివ్వరు!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..