Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ హుస్సేన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవాలని తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా పాకిస్తాన్ మొత్తం కూడా మోడీ ఓడిపోయవాలని కోరుకుంటోందని అన్నారు. భారత్లో ఇండియా కూటమి గెలవాలని మద్దతు ఇచ్చాడు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తో్ందని విమర్శించారు.
ఫవాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల్లో నరేంద్రమోడీ ఓడిపోవాలని ప్రతీ పాకిస్తానీ కోరుకుంటున్నాడు’’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘భారత్లోని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని రెచ్చగొడుతోంది. పాకిస్థాన్కు భారత్పై ద్వేషం లేదు. వారు (బీజేపీ ప్రభుత్వం) ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి, ఈ భావజాలం ఉన్నవారిని ఓడించాలి’’ అని అన్నారు.
Also Read
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
Read Also: Ritika Sajdeh Trolls: రోహిత్ శర్మ సతీమణి రితికాపై ట్రోల్స్!
భారత్లో కొత్తగా ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నరేంద్రమోడీని ఓడించడానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులకు ‘‘శుభాకాంక్షలు’’ తెలిపారు. ఇటీవల ఫవాద్ హుస్సేన్ చౌదరి భారత రాజకీయాలపై ముఖ్యంగా బీజేపీ పార్టీని, ప్రధానిమోడీని వ్యతిరేకిస్తూ, ఇండియా కూటమికి మద్దతు పలుకుతున్నాడు. ‘‘సంపద పునర్విభజన’’ చేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇటీవల కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్-పాకిస్తాన్ బంధం బహిర్గతమైందని ఇటీవల ప్రధాని మోడీ స్పందించారు. ఇతని వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో పాక్ ప్రమేయాన్ని గతంలో ఫవాద్ అంగీకరించారని ఒక నెటిజన్ గుర్తు చేశారు. “మహాఘటబంధన్ మరియు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ గురించి మాకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీని దేశ వ్యతిరేక పార్టీ కేటగిరీలో పెట్టాం. పాకిస్థాన్లోని మైనారిటీలకు మీరు ఏమి చేశారో ముందుగా మీరు సమాధానం చెప్పాలి” అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ వ్యక్తి ఒక జోక్, కానీ వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాడు. నరేంద్ర మోదీని గద్దె దించాలని పాకిస్థాన్ ఎందుకు అంత ఆసక్తిగా ఉందో భారతీయ ఓటర్లకు తెలుసు, అలా జరగనివ్వరు!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!