Pakistan Crisis: పాక్లో మరింత ముదిరిన సంక్షోభం.. మంత్రులు, ఉద్యోగాల్లో కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan To Cut Govt Employees Salaries And Ministers Allowance: ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాక్లో కేవలం మూడంటే మూడు వారాలకు మాత్రమే సరిపడా మాదకద్రవ్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఖర్చులు తగ్గించుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే షరీఫ్ ఇప్పటికే జాతీయ పొదుపు కమిటీ (National Austerity Committee)ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కమిటీ కొన్ని పరిశీలనలు చేసి.. ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.
Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడంతో పాటు మంత్రిత్వ శాఖలు, వాటి సంబంధిత విభాగాల ఖర్చుకు 15 శాతం కోత పెట్టాలని.. ఆ కమిటీ ప్రధాని షరీఫ్కి ప్రతిపాదించినట్టు ఆ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు.. మంత్రుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని, సలహాదారుల సంఖ్యను సైతం కుదించాలని ఆ కమిటీ పరిశీలిస్తోంది. ఆపై మిగిలిన వారు స్వచ్ఛందంగా పని చేయాల్సి ఉంటుందని ఆ కమిటీ తన ప్రతిపాదనలో తెలిజేసినట్టు ఆ వార్తా కథనం పేర్కొంటోంది. ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే.. ఈ కోత, వేటు మార్గాలనే అత్యుత్తమమని ఆ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. మరి.. పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Akkineni Nagarjuna: ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..?
మరోవైపు.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) సహాయం కోసం పాక్ ఎదురుచూస్తోంది. కానీ.. ఆ సంస్థ పెట్టే నిబంధనల్ని పాటించేందుకు మాత్రం పాక్ విముఖత వ్యక్తం చేస్తుంది. గత రెండున్నర నెలల నుంచి ఐఎంఎఫ్, పాక్ మధ్య ఈ పరిస్థితి కొనసాగుతుంది. అటు.. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గాను పాక్ ఇప్పటికే కొన్ని పొదుపు చర్యల్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తుండటంతో పాటు ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించింది. రాత్రివేళల్లో వేడుకలపై నిషేధం విధించి. మాల్స్, ఫ్యాక్టరీలు కూడా త్వరగా మూసివేయాలని ఆదేశించింది. పాలకుల అవినీతి, కరోనా, ప్రకృతి విపత్తులే ఆ దేశాన్ని గట్టిగా దెబ్బతీశాయి.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!