Imran Khan: ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం.. ఇవాళే ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పాక్ సుప్రీంకోర్టు… వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది… ఇక, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అధ్యక్షుడిని కోరలేరని పేర్కొంది.. ఇవాళ అసెంబ్లీని సమావేశ పర్చాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది. మరోవైపు.. జాతినుద్దేశించి ప్రసగించిన ఇమ్రాన్ ఖాన్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. దేశవ్యాప్తంగా ఆదివారం భారీ నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
Read Also: YS Jagan: దూకుడు పెంచిన ఏపీ సీఎం.. వ్యూహం మారిందా..?
Also Read
ఇక, మరోసారి భారత్పై ప్రశంసలు కురిపించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హిందుస్థాన్ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనైన ఆయన.. భారత్లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్ను నిస్వార్థ దేశంగా అభివర్ణించిన ఆయన.. భారత స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని పేర్కొన్నారు.. భారతదేశానికి ప్రపంచంలో ఎంతో గౌరవం ఉందని కొనియాడిన పాక్ ప్రధాని.. కానీ, పాకిస్థాన్ ఒక బానిస దేశమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి తాను ఇచ్చిన సలహా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపక్షాల నేతలు అమ్ముడుపోయారని ఆరోపించిన ఆయన.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు.. 4 నెలల క్రితమే అమెరికా కుట్రలు ప్రారంభించిందని… అమెరికా.. పాకిస్థాన్ రాయబారిని బెదిరించిందన్న ఇమ్రాన్.. తనను తొలగించాలని అమెరికా కోరిందని.. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మొత్తం ప్లాన్ జరిగిందన్నారు.. కానీ, తాను ఎవరికీ కీలుబొమ్మను కాలేనని.. తనకు విదేశీ బ్యాంకుల్లో దోచుకున్న డబ్బు లేదని అన్నారు. ప్రతిపక్షం డబ్బు కోసం దేశాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో 172 మంది సభ్యుల మద్దతు ఉంటే ఇమ్రాన్ను ఓడించవచ్చు.. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును చూపించారు. దీంతో.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాసంలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు.. అదే జరిగితే.. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
-
Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!