Imran Khan: ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం.. ఇవాళే ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పాక్ సుప్రీంకోర్టు… వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది… ఇక, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అధ్యక్షుడిని కోరలేరని పేర్కొంది.. ఇవాళ అసెంబ్లీని సమావేశ పర్చాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది. మరోవైపు.. జాతినుద్దేశించి ప్రసగించిన ఇమ్రాన్ ఖాన్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. దేశవ్యాప్తంగా ఆదివారం భారీ నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
Read Also: YS Jagan: దూకుడు పెంచిన ఏపీ సీఎం.. వ్యూహం మారిందా..?
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఇక, మరోసారి భారత్పై ప్రశంసలు కురిపించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హిందుస్థాన్ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనైన ఆయన.. భారత్లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్ను నిస్వార్థ దేశంగా అభివర్ణించిన ఆయన.. భారత స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని పేర్కొన్నారు.. భారతదేశానికి ప్రపంచంలో ఎంతో గౌరవం ఉందని కొనియాడిన పాక్ ప్రధాని.. కానీ, పాకిస్థాన్ ఒక బానిస దేశమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి తాను ఇచ్చిన సలహా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపక్షాల నేతలు అమ్ముడుపోయారని ఆరోపించిన ఆయన.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు.. 4 నెలల క్రితమే అమెరికా కుట్రలు ప్రారంభించిందని… అమెరికా.. పాకిస్థాన్ రాయబారిని బెదిరించిందన్న ఇమ్రాన్.. తనను తొలగించాలని అమెరికా కోరిందని.. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మొత్తం ప్లాన్ జరిగిందన్నారు.. కానీ, తాను ఎవరికీ కీలుబొమ్మను కాలేనని.. తనకు విదేశీ బ్యాంకుల్లో దోచుకున్న డబ్బు లేదని అన్నారు. ప్రతిపక్షం డబ్బు కోసం దేశాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో 172 మంది సభ్యుల మద్దతు ఉంటే ఇమ్రాన్ను ఓడించవచ్చు.. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును చూపించారు. దీంతో.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాసంలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు.. అదే జరిగితే.. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!