Pakistan: భారత్తో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక వాటిని కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan is buying 60 lakh mosquito nets from India: పీకల్లోతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భారత వ్యతిరేకతను వీడటం లేదు పాకిస్తాన్. భారతదేశంలో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోమని చెబుతోంది. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు, ఆర్టికల్ 370 పునుద్ధరించే వరకు తాము భారత్ తో సంబంధాలు పెట్టుకోమని అంటోంది. దీంతో అక్కడ టొమోటో, ఆలు వంటి నిత్యావసర ధరలు కొండెక్కాయి. కిలోకి రూ. 100కు పైగా ధరలు చేరాయి. భారత్ నుంచి సరుకులు రాక అక్కడి ప్రజలు అల్లాడారు.
ఇదిలా ఉంటే ఇండియాతో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక పాకిస్తాన్ దోమతెరలను భారత్ నుంచి కొనుగోలు చేసింది. జూన్ నెలలో పాకిస్తాన్ మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. మూడొంతుల భూభాగంలో ఒక వంతు నీటితో నిండిపోయింది. వంతెనలు, కరెంట్ స్తంభాలు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎంతో సారవంతమైన భూమి దెబ్బతింది. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2023 జనవరి వరకు పాకిస్తాన్ లోని 32 జిల్లాల్లో 2.7 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Read Also: Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
దీంతో మలేరియా వ్యాధుని తట్టుకునేందుకు భారతదేశం నుంచి సుమారు 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా భారత్ నుంచి వీటిని పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ వరద కారణంగా 1700 మంది మరణించగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. మలేరియా కేసులు సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ లోని మొత్తం 26 జిల్లాల్లోకి తరలించే అవకాశం ఉంది.
భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆగస్టు 5,2019న జమ్మూాకాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయం తరువాత ఇండియా-పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!