Pakistan: భారత్తో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక వాటిని కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan is buying 60 lakh mosquito nets from India: పీకల్లోతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భారత వ్యతిరేకతను వీడటం లేదు పాకిస్తాన్. భారతదేశంలో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోమని చెబుతోంది. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు, ఆర్టికల్ 370 పునుద్ధరించే వరకు తాము భారత్ తో సంబంధాలు పెట్టుకోమని అంటోంది. దీంతో అక్కడ టొమోటో, ఆలు వంటి నిత్యావసర ధరలు కొండెక్కాయి. కిలోకి రూ. 100కు పైగా ధరలు చేరాయి. భారత్ నుంచి సరుకులు రాక అక్కడి ప్రజలు అల్లాడారు.
ఇదిలా ఉంటే ఇండియాతో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక పాకిస్తాన్ దోమతెరలను భారత్ నుంచి కొనుగోలు చేసింది. జూన్ నెలలో పాకిస్తాన్ మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. మూడొంతుల భూభాగంలో ఒక వంతు నీటితో నిండిపోయింది. వంతెనలు, కరెంట్ స్తంభాలు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎంతో సారవంతమైన భూమి దెబ్బతింది. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2023 జనవరి వరకు పాకిస్తాన్ లోని 32 జిల్లాల్లో 2.7 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది.
Also Read
Read Also: Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
దీంతో మలేరియా వ్యాధుని తట్టుకునేందుకు భారతదేశం నుంచి సుమారు 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా భారత్ నుంచి వీటిని పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ వరద కారణంగా 1700 మంది మరణించగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. మలేరియా కేసులు సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ లోని మొత్తం 26 జిల్లాల్లోకి తరలించే అవకాశం ఉంది.
భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆగస్టు 5,2019న జమ్మూాకాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయం తరువాత ఇండియా-పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!