Pakistan: భారత్తో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక వాటిని కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan is buying 60 lakh mosquito nets from India: పీకల్లోతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భారత వ్యతిరేకతను వీడటం లేదు పాకిస్తాన్. భారతదేశంలో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోమని చెబుతోంది. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు, ఆర్టికల్ 370 పునుద్ధరించే వరకు తాము భారత్ తో సంబంధాలు పెట్టుకోమని అంటోంది. దీంతో అక్కడ టొమోటో, ఆలు వంటి నిత్యావసర ధరలు కొండెక్కాయి. కిలోకి రూ. 100కు పైగా ధరలు చేరాయి. భారత్ నుంచి సరుకులు రాక అక్కడి ప్రజలు అల్లాడారు.
ఇదిలా ఉంటే ఇండియాతో సంబంధాలు లేవంటూనే.. దిక్కులేక పాకిస్తాన్ దోమతెరలను భారత్ నుంచి కొనుగోలు చేసింది. జూన్ నెలలో పాకిస్తాన్ మొత్తాన్ని వరదలు ముంచెత్తాయి. మూడొంతుల భూభాగంలో ఒక వంతు నీటితో నిండిపోయింది. వంతెనలు, కరెంట్ స్తంభాలు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎంతో సారవంతమైన భూమి దెబ్బతింది. ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2023 జనవరి వరకు పాకిస్తాన్ లోని 32 జిల్లాల్లో 2.7 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది.
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
Read Also: Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
దీంతో మలేరియా వ్యాధుని తట్టుకునేందుకు భారతదేశం నుంచి సుమారు 60 లక్షల దోమ తెరలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా భారత్ నుంచి వీటిని పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ వరద కారణంగా 1700 మంది మరణించగా.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. మలేరియా కేసులు సింధ్, పంజాబ్, బలూచిస్తాన్ లోని మొత్తం 26 జిల్లాల్లోకి తరలించే అవకాశం ఉంది.
భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆగస్టు 5,2019న జమ్మూాకాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయం తరువాత ఇండియా-పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!