Eknath Shinde: ఏక్నాథ్ షిండే వర్గానికి గుర్తు కేటాయించిన ఈసీ.. గుర్తు ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC allots the ‘Two Swords And Shield symbol’ to Eknath Shinde Shiv Sena: శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వర్గంతోనే ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అసలైన శివసేన తమదే అంటోంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై అంతిమ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే అని చెప్పింది. నవంబర్ నెలలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో శివసేన అసలైన గుర్తు ‘ ధనస్సు-బాణం’ని తమకే కేటాయించాలని ఇరు వర్గాలు పట్టుబట్టాయి. అయితే ఈ గుర్తును ఈసీ స్తంభింపచేసింది. దీంతో పాటు పార్టీ పేర్లను, ఎన్నికల గుర్తును సూచించాలని ఈసీ ఇరువర్గాలను కోరింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ పేరు ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును కేటాయించడంతో పాటు పార్టీ గుర్తుగా ‘కాగడా’ను కేటాయించింది. ఇదిలా ఉంటే ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి ‘ బాలాసాహెబంచి శివసేన’ పేరును కేటాయించడంతో పాటు తాజా ఆయన పార్టీ గుర్తుగా ‘ రెండు కత్తులు-డాలు’ గుర్తును కేటాయిస్తూ మంగళవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏక్ నాథ్ షిండే వర్గం తమకు రావిచెట్టు, కత్తి, సూర్యుడు గుర్తలలో ఏదో ఒకదానిని కేటాయించాలని ఈసీని కోరింది.
Also Read
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
- Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
Read Also: India Assistance To Afghanistan: ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సాయం.. వైద్యసాయం అందచేత
2004లోొ మహారాష్ట్రలో పార్టీగా గుర్తించబడిన ‘పీపుల్స్ డెమోక్రాటిక్ మూమెంట్’ గుర్తును పోలి ఉంది. నవంబర్ 3న జరగబోయే అంధేరి ఈస్ట్ ఎన్నికలను బీజేపీ-ఏక్ నాథ్ షిండేలు, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలని ఇరు వర్గాలు కోరుకుంటున్నాయి.
శివసేన పార్టీలో చెలరేగిన అసమ్మతి పార్టీని రెండు ముక్కలు చేసిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో మహావికాస్ అఘాడీ కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శివసేన శాసనసభ్యులకు, మంత్రులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని..తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఏక్ నాథ్ షిండే క్యాంప్ రాజకీయానికి తెర లేపారు. గౌహతి కేంద్రంగా మెజారిటీ ఎమ్మెల్యేలు క్యాంపులో ఉన్నారు. తరువాత పరిణామాల్లో బీజేపీ పార్టీతో కలిసి ఏక్ నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా సర్కార్ ఏర్పడింది.
తాజావార్తలు
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!