Pakistan: మంత్రుల ఖర్చులు, ఐఎస్ఐ నిధుల్లో కోత.. ఆర్థిక సంక్షోభం నుంచి బయపడేందుకు పాక్ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అప్పుకోసం అనేక పన్నులు విధించిన ఆ దేశం ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. తాజాగా మంత్రుల, సలహాదారుల అలవెన్సులు, ప్రయాణ ఖర్చులను తగ్గించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అనని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులను 15 శాతం తగ్గించాలని ఆదేశించామని, జీతాలు, అలవెన్సులు, లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనలు, బిజినెస్ క్లాస్ ప్రయాణాలు విరమించుకోవాలని కోరినట్లు ప్రధాని వెల్లడించారు. దీని వల్ల 766 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని ఆయన అన్నారు.
Read Also: Karnataka: ఐపీఎస్ రూపా మరో సంచలన పోస్ట్.. నా కుటుంబాన్ని కాపాడుకునేందుకే అంటూ..
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
దీంతో పాటు పాకిస్తాన్ లో అత్యంత కీలకంగా ఉండే నిఘా సంస్థ ఐఎస్ఐ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి ఇచ్చే నిధులపై పరిమిత విధించింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇక ఉచిత విద్యుత్ ఉండబోదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై నిషేధం, మూడేళ్లుగా భర్తీ కాకుండా ఉన్న పోస్టులను తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం చూస్తోంది. ఐఎంఎఫ్ సూచించిన పలు షరతులను కూడా అంగీకరిస్తోంది. ఇప్పటికే దేశంలో పన్నులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ గూడ్స్ పై పన్ను పెంచింది. విద్యుత్ సబ్సిడీలు ఎత్తేయడంతో పాటు టారిఫ్ పెంచడం, పెట్రోల్, డిజిల్ రేట్లను పెంచడవం వంటివి చేస్తోంది.
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..