Khwaja Asif: అమెరికాతో సంబంధాలున్నా.. చైనానే అగ్ర మిత్రదేశం.. పాక్ రక్షణమంత్రి కీలక ప్రకటన
- అమెరికాతో సంబంధాలున్నా.. చైనానే అగ్ర మిత్రదేశం
- పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో పాకిస్థాన్కు మంచి సంబంధాలు ఉన్నాయని.. దీనిపై చైనా ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు. చైనా, అమెరికాతో పాకిస్థాన్కు ఉన్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. తమకు చైనానే అగ్ర మిత్ర దేశమని తేల్చి చెప్పారు. వైట్హౌస్లో ట్రంప్తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ 90 నిమిషాల పాటు రహస్య చర్చలు నిర్వహించారు. ఈ అంశంపై ఖవాజా ఆసిఫ్ స్పందించారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని.. దీనిపై చైనా ఏ మాత్రం ఆందోళన చెందదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Vijay: టీవీకే చీఫ్ విజయ్కు చుక్కెదురు.. స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తిరుచ్చిలో ఫిర్యాదు
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
పాకిస్థాన్ తన ఆయుధాల్లో 80 శాతం చైనా నుంచే కొనుగోలు చేస్తుంది. అయితే తాజాగా ఖనిజ ఒప్పందాలు, క్రిష్టో ఒప్పందాలు, మరికొన్నింటిని ట్రంప్తో పాకిస్థాన్ సంబంధాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనాతో సంబంధం ఏమైనా దెబ్బతీస్తుందా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆసిఫ్ తేల్చి చెప్పారు. అలాంటి ఆందోళనే లేదని.. చైనాతో 50 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు. చైనా మాకు చాలా నమ్మకమైన మిత్రదేశమని చెప్పుకొచ్చారు. ఆయుధాలు దాదాపు చైనా నుంచే వస్తాయని.. మునుపటి కంటే ఎక్కువగా చైనాతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చైనా నమ్మదగిన దేశమని.. భౌగోళికతను కూడా పంచుకుంటున్నట్లు ఆసిఫ్ చెప్పారు.
ఇది కూడా చదవండి: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్లో ఉగ్ర దాడులు.. యూఎన్లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో ట్రంప్తో సమావేశం అయ్యారు. 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిపారు. ఆయా అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక వైట్హౌస్లో ఆహ్లాదకరంగా చర్చలు జరిగాయని పాకిస్థాన్ పీఎంవో తెలిపింది.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..