Khwaja Asif: అమెరికాతో సంబంధాలున్నా.. చైనానే అగ్ర మిత్రదేశం.. పాక్ రక్షణమంత్రి కీలక ప్రకటన
- అమెరికాతో సంబంధాలున్నా.. చైనానే అగ్ర మిత్రదేశం
- పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో పాకిస్థాన్కు మంచి సంబంధాలు ఉన్నాయని.. దీనిపై చైనా ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు. చైనా, అమెరికాతో పాకిస్థాన్కు ఉన్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. తమకు చైనానే అగ్ర మిత్ర దేశమని తేల్చి చెప్పారు. వైట్హౌస్లో ట్రంప్తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ 90 నిమిషాల పాటు రహస్య చర్చలు నిర్వహించారు. ఈ అంశంపై ఖవాజా ఆసిఫ్ స్పందించారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని.. దీనిపై చైనా ఏ మాత్రం ఆందోళన చెందదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Vijay: టీవీకే చీఫ్ విజయ్కు చుక్కెదురు.. స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తిరుచ్చిలో ఫిర్యాదు
Also Read
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
పాకిస్థాన్ తన ఆయుధాల్లో 80 శాతం చైనా నుంచే కొనుగోలు చేస్తుంది. అయితే తాజాగా ఖనిజ ఒప్పందాలు, క్రిష్టో ఒప్పందాలు, మరికొన్నింటిని ట్రంప్తో పాకిస్థాన్ సంబంధాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనాతో సంబంధం ఏమైనా దెబ్బతీస్తుందా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆసిఫ్ తేల్చి చెప్పారు. అలాంటి ఆందోళనే లేదని.. చైనాతో 50 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు. చైనా మాకు చాలా నమ్మకమైన మిత్రదేశమని చెప్పుకొచ్చారు. ఆయుధాలు దాదాపు చైనా నుంచే వస్తాయని.. మునుపటి కంటే ఎక్కువగా చైనాతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చైనా నమ్మదగిన దేశమని.. భౌగోళికతను కూడా పంచుకుంటున్నట్లు ఆసిఫ్ చెప్పారు.
ఇది కూడా చదవండి: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్లో ఉగ్ర దాడులు.. యూఎన్లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో ట్రంప్తో సమావేశం అయ్యారు. 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిపారు. ఆయా అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక వైట్హౌస్లో ఆహ్లాదకరంగా చర్చలు జరిగాయని పాకిస్థాన్ పీఎంవో తెలిపింది.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!