US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..
- దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహాయం చేస్తున్నారని పాక్కు చెందని నాలుగు కంపెనీలపై ఆంక్షలు..
- పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు ముప్పు..
- పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు అతి పెద్ద ముప్పు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి యూఎస్ దళాలు వైదొలిగిన తర్వాత పాక్ తో ఒకప్పటి సంబంధాలు కొనసాగడం లేదన్నారు.
Read Also: AP News: పెనమలూరులో సీఎం, సాలూరులో డిప్యూటీ సీఎం పర్యటన!
Also Read
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
కాగా, మరోవైపు పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీకి సపోర్ట్ ఇచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ వెల్లడించారు. అయితే, అవి ఇరుదేశాలకు సంబంధించిన ఇతర రంగాలను ప్రభావితం చేయవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధనకు అమెరికా కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
Read Also: Truck Blast In Jaipur: జైపూర్లోని పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
అయితే, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్న పాక్కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అయితే, ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఇక, అమెరికా విధించిన ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవిగా పాక్ సర్కార్ ఆరోపించింది. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత నెలకొంటుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!