US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..
- దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహాయం చేస్తున్నారని పాక్కు చెందని నాలుగు కంపెనీలపై ఆంక్షలు..
- పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు ముప్పు..
- పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు అతి పెద్ద ముప్పు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి యూఎస్ దళాలు వైదొలిగిన తర్వాత పాక్ తో ఒకప్పటి సంబంధాలు కొనసాగడం లేదన్నారు.
Read Also: AP News: పెనమలూరులో సీఎం, సాలూరులో డిప్యూటీ సీఎం పర్యటన!
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
కాగా, మరోవైపు పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీకి సపోర్ట్ ఇచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ వెల్లడించారు. అయితే, అవి ఇరుదేశాలకు సంబంధించిన ఇతర రంగాలను ప్రభావితం చేయవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధనకు అమెరికా కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
Read Also: Truck Blast In Jaipur: జైపూర్లోని పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
అయితే, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్న పాక్కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అయితే, ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఇక, అమెరికా విధించిన ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవిగా పాక్ సర్కార్ ఆరోపించింది. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత నెలకొంటుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!