Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- పాకిస్తాన్ సైన్యం జీతాలు భారీగా పెంపు..
- 25 శాతం పెరిగిన జీతాలు..
- సైనికులు మనోబలం కోసమేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ సైనికులకు ఆ దేశ ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటిస్తూనే ఉంది. భారత్తో జరిగిన ఘర్షణలో తామే గెలిచామంటూ ఫేక్ ప్రచారం చేసుకుని, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్’’గా పదోన్నతి పొందాడు. ఇదే కాకుండా ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ తన సైనికులు జీతాలను 25 శాతం పెంచింది. ఆపరేషన్ సిందూర్ వల్ల కలిగిన నష్టాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆమోదం తర్వాత, పాక్ సైనికులు, ఇతర అధికారుల జీతాలు పెంచబడ్డాయి. సవరించిన ప్యాకేజీలో తాత్కాలిక సహాయ భత్యాన్ని 25 శాతం పెంచడంతో పాటు, డిస్ట్రబెన్స్ అలవెన్స్ను మూడు రెట్లు పెంచారు. యూనిఫాం, క్యాష్ బెనిఫిట్స్, బాట్మాన్ భత్యాలను కూడా రెండింతలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
పాక్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో సైన్యం తన జీతాలను పెంచుకుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికుల మనోబలాన్ని పెంచడానికి ఈ పెంపు సాయపడుతుందని పాక్ భావిస్తోంది. ఇటు ఇండియా చేతిలో తీవ్రంగా దెబ్బతినడం, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో సైనికుల్ని తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పెంపు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!