Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ సరికొత్త కుట్ర! ఆ పీఠంపైనే కన్నేశారా?
- పాక్ ఆర్మీ చీఫ్ సరికొత్త కుట్ర!
- ఆ పీఠంపైనే కన్నేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఇక తాజాగా సరికొత్త కుట్రలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ అగ్ర పీఠంపై కన్నేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియా కథనాలపై రామ్మోహన్ నాయుడు ఏం తేల్చారంటే..!
Also Read
అసిమ్ మునీర్.. ఆ మధ్య విదేశాల్లో స్థిరపడిన పాక్ జాతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్పై రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. కాశ్మీర్ మన గుండెకాయలాంటిది.. మన ఊపిరి అంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు 26 మందిని మతం పేరుతో చంపేశారు.
ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
తాజాగా అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గత వారం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్-అసిమ్ మునీర్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాతే పాకిస్థాన్లో రాజకీయ మార్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలా సమావేశాలు జరగడం ఇది రెండోసారి. వరుస భేటీలతో పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని అసిమ్ మునీర్తో భర్తీ చేయాలని భారీగా పుకార్లు జరుగుతున్నాయి. దౌత్యపరంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం తిరుగుబాటు కూడా జరగొచ్చని వదంతులు నడుస్తున్నాయి.
ఈ మధ్య అసిమ్ మునీర్ ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ గల్ఫ్, ఆసియా దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆసిమ్ మునీర్ కూడా వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడు కావడం ఖాయమంటూ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ ప్రధాని లేకుండానే శ్రీలంక, ఇండోనేషియా పర్యటనలకు కూడా మునీర్ వెళ్తున్నారు. ఈ పర్యటనల నేపథ్యంలో పాకిస్థాన్లో ఏదో జరగబోతుందని ప్రచారం సాగుతోంది.
ఇక గత నెలలో అసిమ్ మునీర్ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో మునీర్కు ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కాకుండా మునీర్కు ప్రత్యేక ఆహ్వానం పంపడంపై అప్పుడే పెద్ద చర్చ జరిగింది. పాకిస్థాన్లో ఏదో జరగబోతుందని చర్చలు నడిచాయి. దౌత్యపరమైన ఒత్తిడి కారణంగానే పాకిస్థాన్లో తిరుగుబాటు తప్పదని భావిస్తున్నారు. 1958, అక్టోబర్లో సైనిక తిరుగుబాటు కారణంగా అప్పటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జాను పదవీచ్చుతుని చేసి.. ఆయుబ్ ఖాన్ దేశాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు అసిమ్ మునీర్ కూడా అదే మాదిరిగా చేయాలని చూస్తు్న్నారు. అదే గనుక జరిగితే పాక్ చరిత్రలో ఇది రెండో సంఘటనగా మిగులుతుంది.
ఇక జైల్లో తనకేమైనా జరిగితే మునీర్దే బాధ్యత అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అడియాలో జైల్లో ఉన్నారు. అంటే మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడైతే తనకేదైనా జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. అసలేం ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!