Pakistan: అభినందన్ వర్థమాన్ని పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ హతం..
- అభినందన్ను పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ హతం..
- బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో పాక్కి చిక్కిన అభినందన్ వర్థమాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పుల్వామా ఘటనకు బదులుగా భారత్ 2019లో ‘‘బాలాకోట్ వైమానిక దాడులు’’ నిర్వహించింది. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) పైలట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ -21 బైసన్ విమానంతో అత్యాధునిక అమెరికన్ తయారీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే, ఆ సమయంలో అభినందన్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. అయితే, పారాశ్యూట్ సాయంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగడంతో పాక్ ఆర్మీకి చిక్కారు.
అయితే, పాకిస్తాన్ మేజర్ సయ్యద్ ముయిజ్ అభినందన్ని పట్టుకోవడంతో అతను పాకిస్తాన్లో నేషనల్ హీరోగా మారాడు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని సరర్గోహా ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్ దాడుల్లో సయ్యద్ మరణించినట్లు తెలుస్తోంది. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ యొక్క 6వ కమాండో బెటాలియన్కు పోస్ట్ చేయబడిన మేజర్ సయ్యద్ ముయిజ్ ఆ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మరణించినట్లు సమాచారం.
Also Read
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
Read Also: Pakistan: అమెరికాకు ముప్పుగా పాకిస్తాన్.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ తయారీ..
ఫిబ్రవరి 27న వైమానిక పోరాటంలో భాగంగా, అప్పటి వింగ్ కమాండర్ అయిన గ్రూప్ కెప్టెన్ వర్థమాన్, తరం పాత మిగ్ 21 విమానంలో పాక్ ఎఫ్-16 ఫైటర్ జెట్ను కూల్చివేసి జాతీయ హీరో అయ్యాడు. ఫైటర్ జెట్స్ ‘‘డాగ్ ఫైట్’’ సమయంలో అభినందన్ తన విమానమైన పాత సోవియట్ మిగ్ 21 విమానాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. విమానం దాడికి గురికావడంతో ఆయన పారాశ్యూట్ సాయంతో పీఓకేలో దిగాడు. ఆ సమయంలో పాక్ సైనికులు అభినందన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 6 గంటల పాటు ఆయన పాకిస్తాన్ చెరలో ఉన్నారు. ప్రపంచ దేశాలు ఒత్తిడి, భారత్ దాడి చేస్తుందనే భయంతో అప్పటి ఇమ్రాన్ ఖాన్ సర్కార్ అభినందన్ని గౌరవంగా భారత్కి అప్పగించింది. అభినందన్ నవంబర్ 2021లో అతను గ్రూప్ కెప్టెన్గా పదోన్నతి పొందాడు, వీర్ చక్ర పురస్కారాన్ని అందుకున్నాడు.
తాజావార్తలు
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!