Pakistan: శరణార్థులను కూడా వదలడం లేదు.. ఆఫ్ఘన్లను దోచుకుంటున్న పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే సొంత దేశానికి వెళ్తున్న ఆప్ఘన్లను పాకిస్తాన్ దోచుకుంటోంది. శరణార్థుల ఎగ్జిట్ ఫీజు కింద పాకిస్తాన్ వారి నుంచి వందలాది డాలర్లను వసూలు చేస్తోంది. పాకిస్తాన్ తీరుపై పాశ్చాత్య దేశాలు, ఐక్యరాజ్యసమితి విమర్శలు గుప్పిస్తోంది. ప్రతీ శరణార్థి నుంచి 830 డాలర్లను(సుమారుగా రూ.69000) రుసుముగా వసూలు చేస్తోంది. సరైన పత్రాలు లేని శరణార్థులను పాకిస్తాన్ అణిచివేస్తోంది. దీంతో 20 లక్షల మంది ఆఫ్ఘన్లు దేశం వదిలివెళ్లేందుకు నవంబర్ 1న డెడ్లైన్గా నిర్ణయించింది. గడువు ముగియడంతో పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నారు. ఆగస్టు 2021లో కాబూల్ లో ప్రజా ప్రభుత్వం పతనమై తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆప్ఘనిస్తాన్ జాతీయులు పత్రాలు లేకుండా పాకిస్తాన్ వచ్చి స్థిరపడ్డారు.
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
Read Also: Monkeypox: కాంగోలో శక్తివంతమైన “మంకీపాక్స్” స్ట్రెయిన్ వ్యాప్తి.. ప్రమాదంలో ప్రపంచం..
25,000 మంది ఆఫ్ఘన్లకు పునరావాసం కల్పించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది, 20,000 మందికి పునరావాసం కల్పిస్తామని యూకే చెప్పింది. పాకిస్తాన్ అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. అయితే ఇలా శరణార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం మంచి పద్దతి కాదని పాక్లోని పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు విమర్శించారు. అయితే ముందుగా ప్రతీ శరణార్థి నుంచి 10,000 డాలర్లు వసూలు చేద్ధామని అనుకున్నారు, అయితే దీన్ని 830 డాలర్లకు తగ్గించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పాకిస్తాన్లో ఇటీవల ఉగ్రవాద సంఘటనలు ఎక్కువయ్యాయి. ప్రముఖ ఉగ్రవాదులతో పాటు పాక్ తాలిబాన్లు, మరోవైపు బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ పోలీసులు, సైన్యం, చైనా జాతీయులపై దాడులకు తెగబడుతున్నారు. బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో నిత్యం ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. అయితే వీటి వెనక ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఉన్నట్లు పాక్ ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన అన్ని ఉగ్రదాడుల్లో ఆఫ్ఘన్ జాతీయులు హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చినట్లు పాక్ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులను తరిమికొడుతున్నారు.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!