Pakistan: శరణార్థులను కూడా వదలడం లేదు.. ఆఫ్ఘన్లను దోచుకుంటున్న పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే సొంత దేశానికి వెళ్తున్న ఆప్ఘన్లను పాకిస్తాన్ దోచుకుంటోంది. శరణార్థుల ఎగ్జిట్ ఫీజు కింద పాకిస్తాన్ వారి నుంచి వందలాది డాలర్లను వసూలు చేస్తోంది. పాకిస్తాన్ తీరుపై పాశ్చాత్య దేశాలు, ఐక్యరాజ్యసమితి విమర్శలు గుప్పిస్తోంది. ప్రతీ శరణార్థి నుంచి 830 డాలర్లను(సుమారుగా రూ.69000) రుసుముగా వసూలు చేస్తోంది. సరైన పత్రాలు లేని శరణార్థులను పాకిస్తాన్ అణిచివేస్తోంది. దీంతో 20 లక్షల మంది ఆఫ్ఘన్లు దేశం వదిలివెళ్లేందుకు నవంబర్ 1న డెడ్లైన్గా నిర్ణయించింది. గడువు ముగియడంతో పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నారు. ఆగస్టు 2021లో కాబూల్ లో ప్రజా ప్రభుత్వం పతనమై తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆప్ఘనిస్తాన్ జాతీయులు పత్రాలు లేకుండా పాకిస్తాన్ వచ్చి స్థిరపడ్డారు.
Also Read
Read Also: Monkeypox: కాంగోలో శక్తివంతమైన “మంకీపాక్స్” స్ట్రెయిన్ వ్యాప్తి.. ప్రమాదంలో ప్రపంచం..
25,000 మంది ఆఫ్ఘన్లకు పునరావాసం కల్పించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది, 20,000 మందికి పునరావాసం కల్పిస్తామని యూకే చెప్పింది. పాకిస్తాన్ అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. అయితే ఇలా శరణార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం మంచి పద్దతి కాదని పాక్లోని పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు విమర్శించారు. అయితే ముందుగా ప్రతీ శరణార్థి నుంచి 10,000 డాలర్లు వసూలు చేద్ధామని అనుకున్నారు, అయితే దీన్ని 830 డాలర్లకు తగ్గించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పాకిస్తాన్లో ఇటీవల ఉగ్రవాద సంఘటనలు ఎక్కువయ్యాయి. ప్రముఖ ఉగ్రవాదులతో పాటు పాక్ తాలిబాన్లు, మరోవైపు బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ పోలీసులు, సైన్యం, చైనా జాతీయులపై దాడులకు తెగబడుతున్నారు. బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో నిత్యం ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. అయితే వీటి వెనక ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఉన్నట్లు పాక్ ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన అన్ని ఉగ్రదాడుల్లో ఆఫ్ఘన్ జాతీయులు హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చినట్లు పాక్ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులను తరిమికొడుతున్నారు.
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!