Burger murder: గర్ల్ఫ్రెండ్కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని స్నేహితుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని, ఓ వ్యక్తి ఏకంగా అతని స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన కరాచీలోని హైప్రొఫైర్ ఏరియా డిఫెన్స్ ఫేజ్-5 ఏరియాలో ఫిబ్రవరి 8న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు ముగించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని సెషన్స్ జడ్జి కుమారుడు అలీ కిరియో(17)గా గుర్తించారు.
Read Also: Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
నిందితుడు దనియల్ తన స్నేహితురాలి కోసం ఆర్డర్ చేసిన బర్గర్ తినడంతో అలీ కిరియోల మధ్య వివాదం చెలరేగి, హత్యకు దారి తీసిందని పాక్ మీడియా బుధవారం వెల్లడించింది. నిందితుడు దనియల్ ఎస్పీ నజీర్ అహ్మద్ మిర్బహర్ కొడుకు. దనియల్ తన గర్ల్ఫ్రెండ్ షాజియాను తన నివాసానికి ఆహ్వానించాడని విచారణతో తేలింది. ఈ కార్యక్రమంలో దనియల్ ఇతర స్నేహితులు అలీ కీరియో, అతని సోదరుడు అహ్మెర్ కూడా పాల్గొన్నారు.
దనియల్ తన గర్ల్ఫ్రెండ్ షాజియా కోసం రెండు బర్గర్లను ఆర్డర్ చేశాడు. అయితే, వీటిని అలీ కీరియో తినడంతో వివాదం చెలరేగింది. దీంతో దనియల్ ఒక గార్డు రైఫిల్తో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన కిరియో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమగ్ర విచారణ తర్వాత, ఈ ఘటనలో దనియల్ని బాధ్యుడిగా చేస్తూ నివేదికను సీనియర్ అధికారులకు సమర్పించారు. ప్రస్తుతం దనియల్ నజీర్ కస్టడీలో ఉన్నాడు. దీనిపై న్యాయస్థానంలో వాదనలు జరగాల్సి ఉంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!