Pakistan Jail Crime: పాక్లో దారుణం.. జైల్లో దూరి మరీ హత్య
Pak Man Accused Of Blasphemy Dragged Out Of Jail Killed By Mob: పాకిస్తాన్లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడ్ని.. కొందరు దుండగులు జైల్లో దూరి మరీ అతడ్ని చంపేశారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీసుల ముందే ఈ హత్య జరిగింది. వాళ్లు కనీసం అడ్డుకోకపోవడం గమనార్హం. చివర్లో ఆ మృతదేహానికి నిప్పు పెడుతున్న సమయంలో.. పోలీసులు అడ్డుకున్నారు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరపు, దుప్పట్లు, బీరువా..
Also Read
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
మహ్మద్ వారిస్ అనే 20 ఏళ్ల యువకుడు దైవదూషణ (ఖురాన్పై అసభ్యకర వ్యాఖ్యలు) ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఇతడ్ని నాంకన సాహిబ్ ప్రాంతంలో ఉండే జైల్లో ఉంచారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం.. దైవదూషణ నేరం. దీనికి మరణశిక్ష కూడా విధిస్తారు. వారిస్ కూడా ఆ నేరం చేయడంతో, జైల్లో వేశారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే.. ఓ దుండగుల గుంపు అతడ్ని చంపేసింది. తొలుత ఓ గుంపు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో స్టేషన్లో కొంతమంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఆ గుంపుని అడ్డుకునేలోపే.. వాళ్లు వారిస్పై దాడి చేసి చంపేశారు. అనంతరం అతని మృతదేహానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే ఆ గుంపుని అడ్డుకున్నారు.
Yevgeny Prigozhin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడే ఆగదు.. మరికొన్నేళ్లు సాగుతుంది
ఈ ఘటనపై వకాస్ పోలీస్ అధికారి మహ్మద్ వకాస్ మాట్లాడుతూ.. ‘‘ఉన్నట్లుండి ఓ గుంపు పోలీస్ స్టేషన్లోకి దూరింది. ప్రాంగణం నుండి వారిస్ని బయటకు తీసుకొచ్చి, అతనిపై దాడి చేసి చంపింది. ఆపై నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించింది. స్టేషన్లో కొంతమంది అధికారులు ఉన్నందున వారిని అడ్డుకోలేకపోయారు. అయితే.. మృతదేహాన్ని తగలబెట్టకుండా గుంపును ఆపగలిగాయి’’ అని పేర్కొన్నారు. ఆ గుంపుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఘటనపై ఓ వీడియోని చిత్రీకరించారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. ఆ గుంపుని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.
Turkey Earthquake: 160 గంటలు శిథిలాల కిందే.. ఆ వ్యక్తి మృత్యువును జయించాడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!