220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరుపు, దుప్పట్లు, బీరువా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
220 Couples Married: ఆకాశమంత పందిరి. భూదేవంత అరుగు. వేదమంత్రోచ్చరణల మధ్య ఒక్కటైనన దంపతులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 220 జంటలు ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నారు. సినిమా సెట్టింగులను తలపించేలా పాఠశాల ఆవరణను అందంగా అలంకరించారు. 900 అడుగుల భారీ కల్యాణ వేదికపై సుమారు వెయ్యి మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో జంట కల్యాణం కోసం 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 220 పందిరి వేశారు. ఉదయం 10.05 గంటలకు 220 మంది పురోహితులతో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిగాయి.
Read also: Governor Tamilisai: తమిళిసై సౌందర్రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?

నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో 5 సార్లు సామూహిక వివాహాలు నిర్వహించి 720 మందికి ఉచిత వివాహాలు జరిపించారు. బంగారు పుస్తకాలతో పాటు పట్టు వస్త్రాలు, మంచం, బీరువా, వంట సామాగ్రి, నిజజీవితంలో అవసరమయ్యే వస్తువులను ఒక్కో జంటకు 2 లక్షల రూపాయల చొప్పున అందించారు.220 జంటలను ఒక్కొక్కరికి ముత్యాల పందిరి, ఒక వేద పండితుడు మరియు వధువు కుటుంబ సభ్యులు అందంగా అలంకరించారు. వివాహాది శుభకార్యాలను తిలకించేందుకు వచ్చిన సుమారు 30 వేల మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Read also: Governor Tamilisai: తమిళిసై సౌందర్రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం

వివాహాల అనంతరం వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రతి దంపతులకు స్టీలు పాత్రలు, మంచం, పరుపులు, దుప్పట్లు, బీరువా, రెండు కుర్చీలు, కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాలను ఉచితంగా అందజేశారు. కొత్త జంటలను ఆశీర్వదించారు. ఈ అరుదైన పెళ్లి వేడుకను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆప్రాంతమంతా వధూవరులతో ఆకర్షనీయంగా మారడంతో చూడముచ్చటగా ఉందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా వుండి ఇంతటి అద్భుతమైన పెళ్లి వేడుకను ఏర్పాటు చేసిన ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అభినందించి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు, గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!