220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరుపు, దుప్పట్లు, బీరువా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
220 Couples Married: ఆకాశమంత పందిరి. భూదేవంత అరుగు. వేదమంత్రోచ్చరణల మధ్య ఒక్కటైనన దంపతులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 220 జంటలు ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నారు. సినిమా సెట్టింగులను తలపించేలా పాఠశాల ఆవరణను అందంగా అలంకరించారు. 900 అడుగుల భారీ కల్యాణ వేదికపై సుమారు వెయ్యి మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో జంట కల్యాణం కోసం 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 220 పందిరి వేశారు. ఉదయం 10.05 గంటలకు 220 మంది పురోహితులతో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిగాయి.
Read also: Governor Tamilisai: తమిళిసై సౌందర్రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..

నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో 5 సార్లు సామూహిక వివాహాలు నిర్వహించి 720 మందికి ఉచిత వివాహాలు జరిపించారు. బంగారు పుస్తకాలతో పాటు పట్టు వస్త్రాలు, మంచం, బీరువా, వంట సామాగ్రి, నిజజీవితంలో అవసరమయ్యే వస్తువులను ఒక్కో జంటకు 2 లక్షల రూపాయల చొప్పున అందించారు.220 జంటలను ఒక్కొక్కరికి ముత్యాల పందిరి, ఒక వేద పండితుడు మరియు వధువు కుటుంబ సభ్యులు అందంగా అలంకరించారు. వివాహాది శుభకార్యాలను తిలకించేందుకు వచ్చిన సుమారు 30 వేల మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Read also: Governor Tamilisai: తమిళిసై సౌందర్రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం

వివాహాల అనంతరం వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రతి దంపతులకు స్టీలు పాత్రలు, మంచం, పరుపులు, దుప్పట్లు, బీరువా, రెండు కుర్చీలు, కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాలను ఉచితంగా అందజేశారు. కొత్త జంటలను ఆశీర్వదించారు. ఈ అరుదైన పెళ్లి వేడుకను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆప్రాంతమంతా వధూవరులతో ఆకర్షనీయంగా మారడంతో చూడముచ్చటగా ఉందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా వుండి ఇంతటి అద్భుతమైన పెళ్లి వేడుకను ఏర్పాటు చేసిన ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అభినందించి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు, గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!