Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
- శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు దేశాలకు మధ్యవర్తిగా ప్రస్తుతం పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగినా ఫలించలేదు. మరోసారి చర్చలకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్కు బయల్దేరి వెళ్లారు.
పశ్చిమాసియాలో 3 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరాన్-అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ఇప్పటికే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మూడు రోజుల పాటు టెహ్రాన్లో రహస్య దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో పాటు పలువురు కీలక నేతలను కలిశారు. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తగ్గించడం, ప్రాంతీయ శాంతి స్థాపన, దీర్ఘకాలిక స్థిరత్వంపై చర్చలు జరిగినట్లు ఇరాన్, పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ పరిణామాల మధ్య అసీమ్ మునీర్ పర్యటన వేగంగా ఖరారవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇరాన్ దౌత్య వ్యవస్థలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయిని అధికారిక చర్చల బృంద ప్రతినిధిగా నియమించినట్లు అల్ అరేబియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ను మరోసారి చర్చల ప్రతినిధి బృందానికి నేతగా కొనసాగించారు.
ఇరాన్ ప్రభుత్వం చర్చల సమయంలో దౌత్య పరంగా మరింత సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక హెచ్చరికలు చేశారు. “ఇప్పుడే దౌత్యానికి చివరి అవకాశం. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు” అంటూ వ్యాఖ్యానించారు. చర్చలు విఫలమైతే అపూర్వ స్థాయి సైనిక చర్యలు ఉండవచ్చని వైట్ హౌస్ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఇక ఇరాన్లోని కఠినవాద వర్గాలు కూడా అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాత్కాలిక విరమణను ఉపయోగించుకుని అమెరికా మళ్లీ బలపడే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ.. అవసరమైతే మరింత కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో అసీమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పాకిస్థాన్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!