USA: బైడెన్ పరిపాలనలో కీలక స్థానాల్లో ఇండో అమెరికన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Over 130 Indian-Americans At Key Posts In Biden Administration: అమెరికాలో కీలక స్థానాల్లో భారతీయ-అమెరికన్లకు పాతినిథ్యం వహిస్తున్నారు. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 130 కన్నా ఎక్కువ మంది ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడ్డారు. అన్నింటి కన్నా ముఖ్యంగా భారత సంతతి మహిళ కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానంలో ఉన్నారు. అమెరికాలో ఒక శాతం జనాభా ఉన్న ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా.. గత ఎన్నికల్లో జోబైడెన్ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ హయాంలో 80 మంది భారతీయ-అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు. తాాజాగా జో బైడెన్ ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా రికార్డులను బద్ధలు కొట్టారు. గతంలో బరాక్ ఒబామా తన ఎనిమిదేళ్ల పాలనలో 60 మందికి పైగా భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు.
Read Also: Legends League Cricket 2022: క్రికెట్ అభిమానులకు పండగ.. భారత్లోని ఐదు నగరాల్లో లెజెండ్స్ మ్యాచ్లు
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డాక్టర్ అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వంటి భారతీయ – అమెరికన్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. పలు రాష్ట్రాల్లో, ఫెడరల్ స్థాయిల్లో 40 మందికి పైగా భారతీయ -అమెరికన్లు ఎన్నికయ్యారు. దీంతో పాటు అమెరికా వ్యాప్తంగా ఉన్న 20 అగ్రశ్రేణి కంపెనీలకు భారతీయ-అమెరికన్లే సీఈఓలుగా ఉన్నారు. రొనాల్డ్ రీగల్ అధ్యక్ష కాలంలో మొదటిసారిగా ఇండో అమెరికన్ నియామకం జరగగా.. ఇప్పుడు జో బైడెన్ పరిపానలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ భారతీయులు కనిపిస్తున్నారు.
జో బైడెన్ సెనెటర్ గా ఉన్నప్పటి నుంచే ప్రవాస భారతీయులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. జో బైడెన్ కోటరీలో.. బైడెన్ ప్రసంగ రచయితగా వినయ్ రెడ్డి, కోవిడ్ 19 ప్రధాన సలహాదారుగా డాక్టర్ ఆశిష్ ఝా, వాతావరణ విధానంపై సలహాదారుగా సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్ పై ప్రధాన సహాయకుడిగా చిరాగ్ బైన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కీలక స్థానంలో కిరణ్ అహుజా ఉన్నారు. నీరా టాండెన్ బైడెన్ సీనియర్ సలహాదారుగా ఉన్నారు. వేదాంత్ పటేల్ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ గా ఉండగా.. గరిమావర్మ ఫస్ట్ లేడీ ఆఫీస్ డిజిటల్ డైరెక్టర్ గా ఉన్నారు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!